రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ వితండవాదం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోకూడా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అయితే కమ్యూనిస్టులు అక్కడవాటిగురించి ఆందోళన చేయటంలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారంనుంచి ప్రారంభంకానున్న శాసనసభా సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలు, ఆశా వర్కర్‌‍ల ఆందోళనలు కమ్యూనిస్టులకు పట్టవా అని కేసీఆర్ అన్నారు. సాగర్‌నుంచి రెండోపంటకు నీరు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని చెప్పారు.

ప్రతిపక్షాలు పారిపోయేంతవరకు సభ నిర్వహిద్దామని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలకు సూచించారు. సమావేశాలకు టీఆర్ఎస్ సభ్యులు నూరు శాతం హాజరవ్వాలని, ప్రతి సభ్యుడూ అంశాలవారీగా పూర్తివివరాలతో సభకు రావాలని చెప్పారు. అన్ని అంశాలపై చర్చించేవరకు సభను నిర్వహిద్దామని అన్నారు. 84 మార్కెట్ కమిటీలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి రైతుల ఆత్మహత్యలు అనే మహా సంక్షోభం పరిష్కారానికి చర్యలు తీసుకోవటం పక్కన పెట్టి ఇంకా సీమాంధ్ర జపం చేయటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆత్మహత్యలను సీమాంధ్ర మీడియా హైలైట్ చేస్తోందనటం, కమ్యూనిస్టులు అక్కడెందుకు ఆందోళన చేయటంలేదనటం సమస్య పరిష్కారానికి మీకు లేని నిబద్ధతను, సంకల్పాన్ని ఎత్తిచూపుతున్నాయని ఇప్పటికైనా తెలుసుకోండి ముఖ్యమంత్రిగారూ!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close