నేటి నుండి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు

నేటి నుండి మళ్ళీ తెలంగాణా శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. వచ్చేనెల 10 వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. ఇంతకు ముందు రెండు సార్లు జరిగిన శాసనసభ సమావేశాలలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎక్కువ కాలం కాకపోవడంతో ప్రతిపక్షాల నుండి పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోకుండానే తప్పించుకోగలిగింది. కానీ ఇప్పటికి 14నెలలు పూర్తయిపోయాయి. కనుక రాష్ట్రంలో ఏర్పడుతున్న అన్ని సమస్యలకి గత ప్రభుత్వాలే కారణమని తెరాస ఆరోపిస్తూ చేతులు దులుపుకోలేదు. ఒకవేళ అటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు వాటిని గట్టిగా త్రిప్పి కొడతాయి.

గమ్మత్తయిన విషయం ఏమిటంటే ‘ఆపరేషన్ ఆకర్ష’ ద్వారా ప్రతిపక్షాలను బలహీనపరుద్దామని తెరాస ఇంతకాలం ప్రయత్నించింది. కానీ తెరాస ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి వివిధ సమస్యలపై ఒకదానికొకటి సహకరించుకొంటూ ఒక్క త్రాటిపైకి వచ్చి పోరాడుతున్నాయి. ప్రతిపక్షాల మధ్య అనూహ్యంగా ఏర్పడిన ఈ ఐఖ్యత కారణంగా ఈసారి శాసనసభలో వాటిని ఎదుర్కోవడం తెరాస ప్రభుత్వానికి చాలా కష్టమే. రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, కల్తీ కల్లు వలన మరణాలు, జి.హెచ్.యం.సి.పరిధిలో సుమారు 25లక్షల మంది ఆంధ్రా ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అనేక సమస్యలపై ప్రతిపక్షాలు శాసనసభలో తెరాస ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాయి.

శాసనసభలో తమ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాల వద్ద ‘బలమయిన సబ్జెక్ట్’ ఏదీ లేదని కనుక వారిని చూసి తెరాస ఎమ్మెల్యేలు భయపడనవసరం లేదని, కానీ అందరూ పూర్తి సమాచారంతో సభకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు దైర్యం చెప్పడం గమనిస్తే పరిస్థితి ఏవిధంగా ఉండబోతుందో ఆయనా గ్రహించినట్లే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close