ఇడియట్, పోకిరి, లోఫర్… ఇప్పుడు రోగ్

హైదరాబాద్: టైటిల్స్‌లోనే విలక్షణతను ప్రదర్శించి ఆకట్టుకునే దర్శకుడు పూరి జగన్నాథ్. బద్రితో ప్రస్థానాన్ని ప్రారంభించిన పూరి, తర్వాత ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘అమ్మ నాన్న తమిళమ్మాయి’, ‘కెమేరామేన్ గంగతో రాంబాబు’, ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి విలక్షణ టైటిల్స్ పెట్టటమే కాకుండా మంచి విజయాలనుకూడా సాధించారు. ఆయన తిట్లతో కూడా ‘ఇడియట్’, ‘పోకిరి’, ‘దేశముదురు’ అనే ఒక సిరీస్ తీశారు. ఆ కోవలోనే ప్రస్తుతం లోఫర్(నిర్మాణంలో ఉంది) అనే ఒక చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇప్పుడు మరొక చిత్రాన్ని ప్రకటించారు. నూతన నటుడు ఇషాన్‌ను పరిచయం చేస్తూ తీయబోతున్న చిత్రానికి ‘రోగ్’ అనే టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. ఈ కొత్త హీరో కన్నడ నిర్మాత, నటుడు సీఆర్ మనోహర్ కుమారుడు కావటం విశేషం.

వాస్తవానికి ఈ రోగ్ చిత్రాన్ని పోకిరి చిత్రానికి సీక్వెల్‌గా మహేష్ బాబుతో తీస్తారని గతంలో వార్తలొచ్చాయి. మహేష్‌తో ఒక చిత్రం తీయబోతున్నట్లు పూరి ఇటీవల ప్రకటించారుకూడా. అయితే చిరంజీవిలాగానే మహేష్ కూడా పూరికి హేండ్ ఇచ్చినట్లున్నాడు. అందుకనే కొత్తనటుడిని లాంచ్ చేసే చిత్రానికి రోగ్ అని పేరు పెట్టేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close