కేటీఆర్ కి ఉజ్వల భవిష్యత్ ఉంది: ములాయం సింగ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆహ్వానించడంతో ఆ రాష్ట్రానికి వెళ్ళిన తెలంగాణా ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలంగాణాలో ఇంటింటికీ మంచి నీళ్ళు సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అవి కాకుండా తెలంగాణాలో చేపడుతున్న అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఆయన వారికి చక్కగా వివరించారు. ఆ ప్రాజెక్టు లక్ష్యాలు, దాని కోసం ప్రభువ్తం అమలు చేస్తున్న విధానాలు, వాటి ఫలితాల గురించి ఆయన వారందరికీ అర్ధమయ్యేలాగా ఎంతో చక్కగా విడమరిచి చెప్పిన విధానం చూసి యూపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముగ్దులయిపోయారు. తెలంగాణాలో అమలుచేస్తున్న ఆ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుని చూసేందుకు త్వరలోనే తను తెలంగాణాలో పర్యటిస్తానని అఖిలేష్ తెలిపారు. ఆ తరువాత అఖిలేష్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్, మంత్రి కె. తారక రామారావు రాజకీయాల గురించి మాట్లాడుకొన్నారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాజకీయాలు, బీహార్ ఎన్నికల గురించి వారు మాట్లాడుకొన్నారు. దేశ రాజకీయాలపై మంత్రి కె. తారక రామారావుకి ఉన్న అవగాహన చూసి ములాయం సింగ్ చాలా మెచ్చుకొన్నారు. ఆయనకు ఉజ్వలరాజకీయ భవిష్యత్ ఉందని, రాష్ట్రంలో ప్రముఖ నేతగా ఆయన ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడివాడ వైసీపీలో డబ్బు పంపిణీ రచ్చ

కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు...

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close