తుళ్ళూరులో అసెంబ్లీ సమావేశాలకు అఖిలపక్షం ఓకే

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను తుళ్ళూరులో జరపటానికి ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశం ఆమోదం తెలిపింది. డిసెంబల్ 15 నుంచి ఐదు రోజులపాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షత వహించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, కౌన్సిల్ ఛైర్మన్ చక్రపాణి, వైసీపీ తరపున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , తెలుగుదేశం తరపున కాల్వ శ్రీనివాసులు తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశాలకోసం తుళ్ళూరులో తాత్కాలిక భవనాన్నియుద్ధప్రాతిపదికన నిర్మించనున్నారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలోనే ఈ భవనాన్ని ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. శాసన మండలి సమావేశాలుకూడా ఈ భవనంలోనే నిర్వహిస్తారు. రాజధాని శంకుస్థాపన పూర్తయ్యాక 40 రోజుల్లో తాత్కాలిక అసెంబ్లీ, శాసన మండలిని తుళ్ళూరులో ఏర్పాటు చేస్తామని స్పీకర్ కోడెల చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close