‘ఊపిరి’ సినిమా రిలీజ్ ఫిక్స్..!

కింగ్ నాగార్జున, కార్తి, తమన్నా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఊపిరి.. అనుష్క గెస్ట్ రోల్ చేస్తున్న ఈ సినిమా చాలా వరకు యూరప్లో షూటింగ్ జరుపుకుంది. ఫ్రెంచ్ మూవీ ‘ఇన్ టచబుల్స్’ కి అఫిషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మల్టీస్టార్ సినిమాగా రాబోతున్న ఊపిరిలో కింగ్ నాగార్జున వీల్ చైర్ లో కనిపించి అలరించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పివిపి బ్యానర్లో ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు.

నాగ్, కార్తి మల్టిస్టారర్ గా వస్తున్న ఊపిరిలో వీరిద్దరి మధ్య సీన్స్ అందరిని ఆకట్టుకునేలా ప్లాన్ చేశాడట డైరక్టర్ వంశీ పైడిపల్లి. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు చిత్ర యూనిట్. ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈలోపు కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా రిలీజ్ అవ్వనుంది. ఆ సినిమా డిశెంబర్లో రిలీజ్ అవుతుందని అంచనా.

సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి కి మంచి గ్రిప్ ఉంది. ఆ తరహాలోనే ఊపిరి సినిమా కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు వంశీ. సినిమా చూసిన ఆడియెన్స్ మంచి అనుభూతిని కలిగించే విధంగా సినిమాను రూపుదిద్దుతున్నాడు. మల్టిస్టారర్ సినిమాలు ఊపందుకున్న ఈ టైమ్లో భారీ అంచనాలతో వస్తున్న ఊపిరి సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close