మోడీకి అప్పుడు జేజేలు పలికిన ప్రజలే ఇప్పుడు…

బిహార్ ఎన్నికలలలో బీజేపి ఓడిపోతే పాకిస్తాన్ లో మిటాయిలు పంచుకొంటారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పాకిస్తాన్ లో మిటాయిలు పంచుకొన్నారో లేదో కానీ భారతదేశంలోనే చాలా చోట్ల మిటాయిలు పంచుకొన్నారు. బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు అనేక ఇతర పార్టీలు బీజేపీ ఓటమిని తమ విజయంగా భావించి పండగ చేసుకోవడం పెద్ద ఆశ్చర్యకరమయిన విషయమేమీ కాదు. కానీ సరిగ్గా ఏడాదిన్నర క్రితం మోడీకి జేజేలు పలికిన భారత్ ప్రజలే బిహార్ ఎన్నికలలలో బీజేపి ఓడిపోవడంతో ఏదో ఇదని చెప్పలేని సంతృప్తి పొందుతున్నారెందుకు? అనే సందేహం కలుగకమానదు.

దేశప్రజలలో మోడీ పాలన పట్ల వ్యతిరేకత పెరిగిందా? అంటే లేదనే చెప్పవచ్చును. దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల ప్రజలు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణల వలన ఈ ఏడాదిన్నర కాలంలోనే దేశ ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి జోరందుకొంది. కనుక మోడీ నేతృత్వంలో దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు దృడంగా విశ్వసిస్తున్నారు. మరయితే బిహార్ లో బీజేపీ ఓడిపోతే సంతోషపడుతున్నారెందుకు? అనే ప్రశ్నకు అనేక కారణాలు కనబడుతున్నాయి.

దేశాన్ని సమర్ధంగా పరిపాలించడం, దేశ రాజకీయాలు రెండు వేర్వేరు అంశాలు. మోడీ దేశాన్ని సమర్ధంగానే పరిపాలిస్తున్నారు కానీ ఆయన తన పార్టీపై ఏవిధంగా పూర్తి పట్టు సాధించారో అదేవిధంగా దేశ రాజకీయాలపై కూడా పూర్తి పట్టు సాధించడంలో విఫలమయ్యారు. విఫలమయ్యారని చెప్పుకోవడం కంటే దానిపట్ల అశ్రద్ద చూపించడం వలననే పార్టీపై ఆ దుష్ప్రభావం పడిందని చెప్పవచ్చును. ఆయన పరిపాలనలో లోపాలను వెతికి పట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ మోడీ ఆ అవకాశం ఇవ్వలేదు. అందుకే రాహుల్ గాంధీ ఎంతసేపు మోడీ సూటును పట్టుకొని వ్రేలాడుతుంటారు తప్ప ఆయన పరిపాలనలో ప్రభుత్వానికి సంబంధించి నిర్దిష్టమయిన లోపాలు ఎత్తి చూపి మాట్లాడలేకపోతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఆర్.ఎస్.ఎస్.,శివసేన, బీజేపీకి సన్నిహితంగా ఉండే కొందరు సాధువులు దేశంలో ముస్లింలకు, ఇతర మైనార్టీ వర్గాలకు ఆందోళన రేకెత్తించి విధంగా చేస్తున్న వివాదాస్పద వ్యాక్యలు, చేస్తున్న దాడులు దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ మరియు దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు మోడీని ఎదుర్కొనేందుకు బలమయిన ఆయుధాన్ని అందించాయని చెప్పవచ్చును. ఆర్.ఎస్.ఎస్.,శివసేన, తదితరులు అందించిన ఆ అపూర్వ అవకాశాన్ని అందిపుచ్చుకొన్న కాంగ్రెస్ మరియు దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు దేశంలో మత అసహనం పెరిగిపోతోందని, భావ స్వేచ్చ నశించిపోతోందని చాలా ఉదృతంగా ప్రచారం చేసాయి.

ఆ ప్రభావానికి అనేకమంది రచయితలు, కళాకారులు, ప్రముఖులు కూడా లోనవడం చాలా విచిత్రంగా ఉంది. కమల్ హాసన్ వంటి ప్రముఖ నటుడు, తన జాతీయ అవార్డును వెనక్కి తిరిగి ఇచ్చేయమని కొందరు తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని చెప్పడం చూస్తే, బీజేపీ వ్యతిరేక శక్తులు తెర వెనుక ఎంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చును. తెర వెనుక కారణాలు ఎవయితేనేమి చాలా మంది ఏదో పూనకం (మాస్ హిస్టీరియా) వచ్చినట్లుగా తమ అవార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేయడం మొదలుపెట్టారు.

అది సామాన్య ప్రజలను కూడా ఆలోచింపజేసింది. ఆర్.ఎస్.ఎస్. తదితర నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, దేశంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో కలిపి ముడిపెట్టి చూస్తూ మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో మళ్ళీ మత విద్వేషాలు పెరిగిపోయాయని విశ్వసించడం మొదలుపెట్టారు. ప్రజలలో ఈ అనుమాన బీజాలను నాటిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, బీజేపీ వ్యతిరేక శక్తులు, మోడీ హయాంలో మత అసహనం పెరిగిపోతోందంటూ చేస్తున్న ప్రచారంతో, హడావుడితో ప్రజలను కూడా నమ్మించగలిగాయి. కానీ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ విషప్రచారాన్ని సమర్ధంగా అడ్డుకోవడంలో మోడీ చాలా అశ్రద్ద చూపించారు. బీజేపీ నేతలు కూడా ఆ విష ప్రచారాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఆ కారణంగానే ప్రజలలో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగింది. అదే ఇప్పుడు బిహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినప్పుడు వారి ముఖాల్లో ప్రతిఫలిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close