ఏఆర్ రహమాన్ కి కూడా అసహనమే!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ భారత్ లో మత అసహనం పెరిగిపోతోందని చేసిన వ్యాఖ్యలపై ఇంకా దుమారం రేగుతూనే ఉంది. ఇప్పుడు ప్రముఖ సంగత దర్శకుడు ఏఆర్ రహమాన్ కూడా అసహనం పల్లవి ఆలపిస్తున్నారు. అయితే అందుకు పేర్కొన్న కారణాలు, తన వాదనను సమర్ధించుకొంటున్న విధానం రెండూ చాలా విచిత్రంగా ఉన్నాయి. కొన్ని నెలల క్రితం ఆయన “ముహమ్మద్-మెసెంజర్ ఆఫ్ గాడ్” అనే ఒక ఇరానీ సినిమాకు సంగీతం సమకూర్చినప్పుడు, అందుకు ఆగ్రహించిన ‘రజా అకాడమీ’ అనే ముస్లిం మత సంస్థ ఆయనకు వ్యతిరేకంగా ఒక ఫత్వా జారీ చేసింది. అది దేశంలో పెరుగుతున్న మత అసహనానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడుతున్నారు. దేశంలో వివిద రంగాలకు చెందిన ప్రముఖులు దేశంలో మత అసహనం పెరిగిపోతోందని వాదిస్తూ గత రెండు మూడు నెలలుగా తమ అవార్డులను కేంద్రప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నారు. దానిపై స్పందించిన ఏఆర్ రహమాన్, “మహాత్మాగాంధీ సూచించిన అహింసా పద్దతిలో వారు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి ఒకరినొకరు కొట్టుకోకుండా ఈవిధంగా నిరసనలు తెలియజేయడం కవితాత్మకంగా ఉంది. అవసరమయినప్పుడు తిరుగుబాటు చేయవచ్చును కానీ అది చాలా హుందాగా ఉండాలి. దేశంలో ప్రముఖులు ఇప్పుడు అలాగే తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అది చాలా మంచి పద్ధతి,” అని అన్నారు. దేశంలో ముస్లింలు అభద్రతాభావం కలిగి ఉన్నారా? అనే ప్రశ్నకు ఆ సంగతి తనకు తెలియదని ఆయన సమాధానం దాట వేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close