నేటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

నేటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. వచ్చే నెల 28వరకు సాగే ఈ సమావేశాలలో 30 బిల్లులపై చర్చించి ఆమోదం పొందవలసి ఉంది. అందుకు ప్రతిపక్షాల సహకారం కోరేందుకు అధికార ఎన్డీయే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బాలనేరస్థుల శిక్షలను కటినతరం చేయడం కోసం చట్ట సవరణలు, జి.ఎస్.టి., రియల్ ఎస్టేట్, ఎస్సి ఎస్టీ బిల్లు మొదలయిన వాటిపై చర్చించి ఆమోదించవలసి ఉంది. అలాగే కేంద్రప్రభుత్వం జారీ చేసిన కొన్ని ఆర్డినెన్స్ లపై చర్చించి ఆమోదించవలసి ఉంది. ఈ సమావేశాలలోనే అగ్రికల్చర్ బయో సెక్యురిటీ మరియు న్యూక్లియర్ సేఫ్టీ బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇవికాక వివిధ పద్దుల క్రింద అదనపు నిధులు మంజూరు చేయడానికి బడ్జెట్ సవరణల ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలుపవలసి ఉంది. కానీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు యధాప్రకారం ఈసారి కూడా పార్లమెంటు కార్యక్రమాలను స్తంభింపజేయడానికి సంసిద్ధం అవుతున్నాయి. ఈ బిల్లులలో అతిముఖ్యమయిన జి.ఎస్.టి.బిల్లుకి తాము వ్యతిరేకం కాదని చెపుతూనే దానికి కొన్ని సవరణలు సూచించి, అవి చేస్తేనే ఆ బిల్లుకి మద్దతు ఇస్తామని వాదిస్తోంది.

గత సమావేశాలలో లలిత్ మోడీ కేసును పట్టుకొని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రాజీనామాలకు, వ్యాపం కుంభకోణంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామాకు పట్టుబడుతూ పార్లమెంటును స్తంభింపజేసిన కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఈసారి మత అసహనం అంశాన్ని పట్టుకొని పార్లమెంటుని స్తంభింపజేసేందుకు సిద్దం అవుతున్నాయి. సభా కార్యక్రమాలు సజావుగా జరుగనిస్తే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అన్ని సమస్యలపైనా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్రప్రభుత్వం హామీ ఇస్తోంది. కానీ మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఆనందించాలని కాంగ్రెస్ మిత్రపక్షాలు భావిస్తున్నాయి కనుక ప్రభుత్వానికి సహకరించకపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close