ఏబీవీ సర్వీస్ ఐదేళ్ల పాటు పొడిగిస్తారా !?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అక్రమం అని క్యాట్ తీర్పు చెప్పింది. ఆయన జీతభత్యాలు మొత్తం ఇవ్వాలని చెప్పింది. ఓ ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్ జీతభత్యాలు మాత్రమే పొందడం కాదు. ఆయన సర్వీసులో ఐదేళ్ల పాటు నష్టపోయారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?. ఈ నెలాఖరులో రిటైర్ కావాల్సి ఉంది. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెండ్ చేయకపోతే ఆయన డీజీపీ అయి ఉండేవారు. ప్రభుత్వ కక్ష సాధింపుల వల్ల ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు ?

ఏబీవీ తప్పు చేశారని ఐదేళ్లకాలంలో నిరూపించలేకపోయారు. కానీ ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయడానికి మాజీ డీజీపీ ఒకరు ఫోర్జరీ చేశారు.ఈ విషయాన్ని ఏబీవీనే బయట పెట్టారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి అడ్డంగా దొరికిన ఐపీఎస్‌లు ఎంతో మంది ఉన్నారు. వారిలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వారెవరూ.. తాను తప్పు చేయలేదని ఏబీవీలా పోరాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు చేసిన తప్పులు కళ్ల ముందే సాక్ష్యాలతో ఉన్నాయి. వారిని ఎవరూ కాపాడలేరు అనేది.. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించిన ఏబీవీ ఉదంతమే నిరూపిస్తోంది.

కౌంటింగ్ వచ్చే నెల నాలుగో తేదీన జరుగుతుంది. ఈ నెల 30వ తేదీనే ఆయన రిటైర్ అవ్వాల్సింది. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారితే… ఆయనను కొనసాగించడానికి కేంద్రానికి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది. కానీ అంతకు ముందే రిటైర్మెంట్ డేట్ రావడం ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వం మారితే ఆయన సర్వీస్ ఖచ్చితంగా కొనసాగుతుంది… అయితే అది నేరుగా సర్వీస్ కొనసాగింపా లేకపోతే.. ప్రత్యేకంగా మళ్లీ ఏదైనా పోస్టు సృష్టించి రిటైర్డ్ అధికారి కేటగిరిలో తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close