ఏబీవీ సర్వీస్ ఐదేళ్ల పాటు పొడిగిస్తారా !?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అక్రమం అని క్యాట్ తీర్పు చెప్పింది. ఆయన జీతభత్యాలు మొత్తం ఇవ్వాలని చెప్పింది. ఓ ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్ జీతభత్యాలు మాత్రమే పొందడం కాదు. ఆయన సర్వీసులో ఐదేళ్ల పాటు నష్టపోయారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?. ఈ నెలాఖరులో రిటైర్ కావాల్సి ఉంది. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెండ్ చేయకపోతే ఆయన డీజీపీ అయి ఉండేవారు. ప్రభుత్వ కక్ష సాధింపుల వల్ల ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు ?

ఏబీవీ తప్పు చేశారని ఐదేళ్లకాలంలో నిరూపించలేకపోయారు. కానీ ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయడానికి మాజీ డీజీపీ ఒకరు ఫోర్జరీ చేశారు.ఈ విషయాన్ని ఏబీవీనే బయట పెట్టారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి అడ్డంగా దొరికిన ఐపీఎస్‌లు ఎంతో మంది ఉన్నారు. వారిలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వారెవరూ.. తాను తప్పు చేయలేదని ఏబీవీలా పోరాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు చేసిన తప్పులు కళ్ల ముందే సాక్ష్యాలతో ఉన్నాయి. వారిని ఎవరూ కాపాడలేరు అనేది.. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించిన ఏబీవీ ఉదంతమే నిరూపిస్తోంది.

కౌంటింగ్ వచ్చే నెల నాలుగో తేదీన జరుగుతుంది. ఈ నెల 30వ తేదీనే ఆయన రిటైర్ అవ్వాల్సింది. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారితే… ఆయనను కొనసాగించడానికి కేంద్రానికి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది. కానీ అంతకు ముందే రిటైర్మెంట్ డేట్ రావడం ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వం మారితే ఆయన సర్వీస్ ఖచ్చితంగా కొనసాగుతుంది… అయితే అది నేరుగా సర్వీస్ కొనసాగింపా లేకపోతే.. ప్రత్యేకంగా మళ్లీ ఏదైనా పోస్టు సృష్టించి రిటైర్డ్ అధికారి కేటగిరిలో తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్.. ముహూర్తం కుదిరింది!

ఎన్టీఆర్ త‌దుప‌రి సినిమా ఏమిట‌న్న విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో ఎన్టీఆర్ తో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. 'దేవ‌ర‌' త‌ర‌వాత ఎన్టీఆర్ న‌టించే...

“డిపార్టుమెంట్”పై నమ్మకం మళ్లీ ఎలా పెంచుకోగలరు !?

నేరపూరిత మనస్థత్వం ఉన్న వ్యక్తి చేతుల్లోకి న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు వెళ్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో గత ఐదేళ్లుగా ఏపీ చూసింది. బాధితులు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఒక్క...

ఈవారం బాక్సాఫీస్‌: ప్రేక్ష‌కుల మూడ్ మారుతుందా?

మొన్న‌టి వ‌ర‌కూ ఎన్నిక‌ల ఫీవ‌ర్ తో వ‌ణికిపోయారు తెలుగు ప్రజ‌లు. దాంతో సినిమాల గురించి పెద్ద‌గా పట్టించుకొనే స‌మ‌యం దొర‌క‌లేదు. బాక్సాఫీసు ముందుకు చిన్నా, చిత‌కా సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటికి ఆద‌ర‌ణ క‌రువైంది....

కాంగ్రెస్ జిల్లాల జోలికెళ్తే బీఆర్ఎస్‌ చేతికి సెంటిమెంట్ అస్త్రం !

తెలంగాణలో రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన జిల్లాలతో పాలనా పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు జడ్పీటీసీలు లేని పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close