మీడియా వాచ్ : జగన్ అప్పులు.. ఆంధ్రజ్యోతికి ప్రకటనలు !

ఆంధ్రజ్యోతి అంటే జగన్‌కు పడదు. ఆ విషయం ఆయనే బయట ఎక్కడ మైక్ అందుకున్నా చెబుతూంటారు. అందుకే తన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఒక్క రూపాయి ప్రకటన ఇవ్వకుండా కట్టడి చేశారు. ఆ పత్రిక కొనుగోలు ఏ ప్రభుత్వ ఆఫీసులో లేకుండా చేశారు. అయితే తప్పనిసరిగా ఆయన చేస్తున్న అప్పులతో ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనల ఆదాయం వస్తోంది. ఇది ఆయన ఊహించని మార్గం నుంచి వస్తోంది.

ఏపీ ప్రభుత్వానికి ప్రతి మంగళవారం పండుగ రోజు. అంటే ఆర్బీఐ నుంచి రూ. రెండు వేల కోట్లు అప్పు తెచ్చుకోగలిగిన రోజు. ఈ సందర్భంగా ఆర్బీఐకి ముందే ఇండెంట్ పెడుతుంది. ఆ మేరకు బాండ్లు వేలం వేస్తామని చెబుతుంది. ఆర్బీఐ పత్రికల్లో ఇలా ఏపీ ప్రభుత్వం బాండ్లు వేలం వేస్తుందని ప్రకటన ఇస్తుంది. ఈ ప్రకటన తెలుగు పత్రికల్లో ఆంధ్రజ్యోతిలోనే వస్తుంది. జగన్ ప్రభుత్వం అప్పులు చేసేస్తోందని ఆంధ్రజ్యోతి తీవ్రంగా విమర్శిస్తూ ఉంటుంది. చివరికి ఆ పత్రికలోనే అప్పులకు వెళ్తున్నట్లుగా ఆర్బీఐ ప్రకటన కూడా ఆర్బీఐ ఇస్తుంది. దీంతో ఆంధ్రజ్యోతికి రెండు వైపులా లాభం కనిపిస్తోంది.

అయితే ఈ ప్రకటనలు వద్దు అని ఆర్బీఐకి ప్రభుత్వం చెప్పలేదు. ఎందుకంటే సీఎం అయినంత మాత్రాన ఆర్బీఐ ఎవరికి ప్రకటనలు ఇవ్వాలో ఇవ్వకూదదో చెప్పలేరు. అప్పులు తీసుకోవడం మానేస్తే అసలు ప్రకటనలే ఇవ్వరు కదా అని పరిష్కారం దొరకవచ్చు. కానీ ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది. అసలు అప్పులు తీసుకోకపోతే రోజు గడిచేదెలా ? అందుకే ఈ విషయంలో జగన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆంధ్రజ్యోతికి జగన్ వల్ల ఇలాగైనా కాస్త ఆదాయం వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close