ఏపీ సర్కార్‌పై రివర్స్ కేసులు పెడుతున్న ఆంధ్రజ్యోతి..!

మీడియాపై కేసులు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సుప్రీంకోర్టు ధిక్కరణ”కు పాల్పడిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్ దాఖలు చేసింది. కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ.. రఘురామకృష్ణరాజు మాట్లాడిన ప్రెస్‌మీట్‌ను ప్రత్యక్షంగా ప్రసారం చేసినందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసింది. ఇలాంటి కేసులు నమోదు చేయడం పూర్తిగా సుప్రీంకోర్టు ఏప్రిల్ 30వ తేదీన ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్‌లో పేర్కొంది.

కరోనాకు సంబంధించిన సమాచారాన్ని చెప్పడం.. షేర్ చేయడం… అలాగే పౌరులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వెల్లడించడం ఏ మాత్రం తప్పు కాదని.. అలా చేయడం నేరం కాదని.. సుప్రీంకోర్టు ఏప్రిల్ 30వతేదీన ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఎవరైనా తప్పుడు సమాచారం అని కేసులు పెడితే.. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని.. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానసం స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా తన ప్రెస్‌మీట్లలో కరోనా అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తన అభిప్రాయాలు చెప్పారు. వాటిని ప్రసారం చేసినందుకు ఏబీఎన్ చానల్‌పై కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు మీడియాను భయపెట్టి… ప్రజా గొంతుకను వినిపించకుండా చేయాలన్న కుట్రతో… పోలీసు అధికారులను ప్రయోగిస్తున్నారని.. మీడియా ప్రసారాలను చట్ట విరుద్ధంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఏబీఎన్ పిటిషన్‌లో స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నందున కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తున్నామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తన పిటిషన్‌లో తెలిపింది. ఈ పిటిషన్‌లో చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతంసవాంగ్‌లతో పాటు సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌లను ప్రతివాదాలుగా చేర్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close