ఆర్కే పలుకు : షర్మిలకు సలహాదారుగా ఆర్కే !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలపై ఎప్పుడూ . .. ఎక్కడా లేనంత సానుభూతి చూపిస్తున్నారు. ఎంతగా అంటే.. అప్రకటిత సలహాదారుగా మారిపోయారు. ఆమెకు అన్యాయం జరిగిపోతోంది.. ఆర్థిక సమస్యల్లో ఉంది.. ఇప్పుడు బయట పడాలంటే తక్షణం ఆస్తులు పంచుకోవాలని సలహాలిస్తున్నారు. కానీ ఆస్తులు పంచుకోవడానికి జగన్ అంగీకరించడం లేదు. ఒక్క పైసా ఇవ్వనని ఆయన తెగేసి చెబుతున్నారు. మరి ఇప్పుడేం చేయాలి..? దీనికి కూడా ఆర్కే సలహా ఇచ్చేశారు.. జగన్‌ను రాజకీయంగా బలహీనం చేయాలి ?. జగన్‌ను రాజకీయంగా బలహీనం చేస్తేనే ఆందోళన చెంది ఆస్తులు పంచి ఇస్తాడు..? కానీ అది ఎలా..? దీనికి కూడా ఆర్కే సలహా ఇచ్చారు.. ఎలా ఉంటే.. ఏపీలో రాజకీయ పార్టీ పెట్టడమే !. ఏపీలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టి జగన్‌ను రాజకీయంగా బలహీనం చేసే ప్రయత్నం చేస్తేనే అన్న భయపడి ఆస్తులు పంచుతాడనేది ఆర్కే లాజిక్.

వైఎస్ కుటుబంలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది బహిరంగ రహస్యం. జగన్, షర్మిల మధ్య విబేధాలు పెరిగిపోయాయన్నది కూడా నిజమే. అయితే ఆ వివాదాలు దేనికోసం అన్నదానిపై స్పష్టత లేదు. అన్నకు వ్యతిరేకంగా షర్మిల ఇప్పటికీ బహిరగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆస్తుల వివాదం విషయంలో ఆమె అసంతృప్తిగా ఉన్నారని ఇటీవల పలు కారణాలు బయటకు వచ్చాయి. ఆర్కే ఇంటర్యూలోనే సగం వస్తాయి.. రాకుండా ఎక్కడికి పోతాయని ఆమె స్పష్టం చేసింది. అదే సమయంలో సాక్షి పత్రిక యజమానినని కూడా ప్రకటించుకున్నారు. వీటిని బట్టి చూస్తే షర్మిల ఆస్తుల్లో వాటా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది తేలిపోతోంది. అయితే జగన్ రెడ్డి వద్ద మాత్రం ఇలాంటి పప్పులేమీ ఉడకవని చాలా మందికి తెలుసు. ఆర్కేకి తెలియకుండా ఉండదని అనుకోలేం. తండ్రి సంపాదించిన ఆస్తులు అయితే వాటా ఇస్తారు కానీ .. జగన్ తన ఐడియాలను పెట్టుబడిగా పెట్టి ఆస్తులు సంపాదించారు. మరి ఎందుకు ఇస్తారు ?

అయితే తెలంగాణ లో రాజకీయ పార్టీ పెట్టి విపరీతంగా ఖర్చులు పెంచుకున్న షర్మిల ఆస్తులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆమె గురించి బాగా తెలిసినట్లుగా ఉన్న ఆర్కే.., ఈ విషయంలో ఆమెకు అప్రకటిత సలహాదారుగా మారిపోయారు. నేరుగా సలహాలిస్తున్నారో లేదో తెలియదు కానీ.. తన పత్రిక ద్వారా మాత్రం సందేశాలు నేరుగానే పంపుతున్నారు. ఆ సందేశాల కోసమే ఈ వారం వారాంతపు ఆర్టికల్ ” కొత్తపలుకు”ని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకున్నారు.

ఈ వారం ఆర్టికల్‌లో సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు.. వాటిని సమర్థించుకోవడానికి పేదల్ని అడ్డుపెట్టుకుంటున్న వైనం.. ప్రశ్నించాల్సిన వారంతా మౌనం పాటించడం వంటివి ఎప్పట్లానే ప్రస్తావించారు. అయితే అవన్నీ జనానికి తెలిసినవే. ఆర్కే చెబితేనే తెలుసుకునే విషయాలు కావు. కానీ ఆర్కే ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఈ సారి కూడా చెప్పారు. వాటి గురించి పక్కన పెడితే.. షర్మిలకు సలహాలివ్వడానికి.., జగన్‌పై ఆగ్రహం మరింత పెంచడానికి మాత్రం తన ఆర్టికల్‌గా పక్కాగా ఉపయోగించుకున్నారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close