ఆర్కే పలుకు : దమ్ముంటే చర్చకు రా.. జగన్ !

వైసీపీ అధినేత, సీఎం జగన్ తన ప్రత్యర్థులుగా తేల్చేసుకున్న దుష్టచతుష్టంలో ఉన్న ఆంధ్రజ్యోతి ఆర్కే ఈ విషయాన్ని ప్రివిలేజ్‌గా తీసుకుంటున్నారు. ఎంతగా అంటే.. నేరుగా రాజకీయ నేతను అని జగన్ అనుకుంటున్నారు కాబట్టి తాను కూడా ఆ స్థాయిలోనే సవాళ్లు చేస్తున్నారు. తాజాగా ప్రతి వారాంతం రాసే కొత్త పలుకు ఆర్టికల్‌లో నేరుగా జగన్‌కే సవాల్ చేశారు. జగన్ మంచి చేస్తున్నారో.. చెడు చేస్తున్నారో.. తాము తప్పుడు ప్రచారం చేస్తున్నామో నిజాలు చెబుతున్నామో తేల్చుకునేందుకు ఏబీఎన్ స్టూడియోలో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఈ వారం కొత్తపలుకులో ఈ సవాలే హైలెట్.

ఓ పత్రికాధిపతి .. సీఎంను సవాల్ చేయవచ్చా.. ఆయన స్థాయేంటి అని కొంత మంది నీలిగే చాన్స్ లేకుండా ఆర్కే తన సవాల్‌లో అర్థముందని నేరుగానే చెప్పారు. సీఎం జగనే నేరుగా.. తన ప్రత్యర్థిగా ఆర్కేని పేర్కొనడమే.. ఆయన నేరుగా చర్చకు రావడానికి సరిపోతుందని.. ఇక ఆలస్యంగా జగన్‌దేనన్నట్లు సంకేతాలు పంపించారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్పందించడం కష్టం కానీ.. ఆర్కే చేసిన సవాల్ మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోతుంది.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంత వరకూ ఒక్క ప్రెస్ మీట్‌ను కూడా ఎదుర్కోలేదు. ఆయన నేరుగా మాట్లాడటం కూడా కష్టమైపోతోంది. రికార్డు చేసిన వీడియోల్లోనే ఎన్నో బ్లూఫర్స్ బయటపడుతూ ఉంటాయి.చూసి చదివే దాంట్లో కూడా సింధూపురం, గుండూరు అంటూ అందరికీ తెలిసిన ఊరి పేర్లను కూడా తప్పుగా చదవుతుంటారు. ఇక నేరుగా చర్చ అంటే అసలు కనీసం అలాంటి ఆలోచన కూడా చేయరని ఆర్కే నమ్మకం. వైసీపీలోనూ అలాంటి నమ్మకమే ఉంది. ఆయన నేరుగా ఎవరితోనూ చర్చకు వెళ్లే చాన్స్ లేదు. అయితే ఆయన ఆర్కే చేస్తోంది తప్పు అని నిరూపించాలనుకుంటే చర్చకు వస్తారని.., లేకపోతే ఆయన రారని కౌంటర్లు, సెటైర్లు పడే అవకాశం ఉంది.

ఆర్కే తన కొత్తపలుకులో ఎప్పట్లాగే జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. జగన్ బాడిలాంగ్వేజ్, మొహంలో కనిపిస్తున్న ముఖ కవళికుల్లో జగన్‌లో పరాజయ భయాన్ని ఆర్కే చూస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేశారని ఉదాహరణలు చెప్పారు. అయితే ఈ సారి ప్రశాంత్ కిషోర్ కోణంలో చెప్పారు. పీకే లాంటి వాళ్లు కృత్రిమంగా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి చేయిస్తున్న రాజకీయాల వల్ల దేశం నాశనమైపోతోందని.. కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యులుగా పేరు తెచ్చుకున్న వారు కూడా ఆయన ప్రభావానికి లోను కావడం అంటే… రాజకీయాల రూపం మారిపోయినట్లేనని ఆర్కే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close