ఆర్కే పలుకు : జగన్‌కు సపోర్టు చేసే వాళ్లుండటం కలికాలమే !

ప్రచారసభల్లో జగన్మోహన్ రెడ్డి అమాయకంగా తనపై కుట్రలు చేస్తున్నారని.. తాను ఎంతో మంచి వాడినని .. ఇది కలికాలం అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను సూటిగా తగిలాయి. ఆయనకు కూడా అలాగే అనిపించినట్లుగా ఉంది. ఈ కొత్తపలుకును పూర్తిగా ఆ కలికాలానికే కేటాయించారు. ఎంత కలి కాలం కాకపోతే.. అడ్డగోలుగా హత్యలు చేసి..దోపిడీలు చేసి.. అరాచకం చేసి… రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.. కూడా జగన్మోహన్ రెడ్డి కొంత మంది మద్దతు పొందుతారని ఆయన డౌట్. కళ్ల ముందు ఇంత కనిపిస్తున్నా జగన్మోహన్ రెడ్డికి కొంత మంది ఓటు వేసే వాళ్లు ఉండటం కలికాలమేనని ఆర్కే భావన.

కలికాలం పేరుతో జగన్ చెబుతున్న మాటలకు.. ఆయన చేసిన పనులు.. చేస్తున్న పనులకు పొంతన లేకపోవడంతో ఆర్కేకు కోపం వచ్చినట్లుగా ఉంటుంది. వైఎస్ వివేకా హత్య కేసు నుంచి ప్రతి విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు. చివరికి న్యాయం చేయమని అడుగుతున్న చెల్లెళ్లపైనా ఇష్టం వచ్చినట్లుగా నిందలు వేసి.. హంతకుడ్ని కాపాడుతున్న తీరు కలికాలమేననేది ఆర్కే భావన. అయితే ఈ కలికాలంలో కలి ఎవరో ప్రజలకు క్లారిటీ వచ్చిందని ముఖ్యంగా కడప ప్రజలకూ క్లారిటీ వచ్చిందని ఆర్కే చెబుతున్నారు. దానికి బస్సు యాత్ర పరిస్థితుల్నే సాక్ష్యంగా చూపిస్తున్నారు.

టీడీపీ కూటమి పొత్తులు పెట్టుకున్న తర్వాత వైసీపీ పరిస్థితి మెరుగు అయిందంటూ వైసీపీ మీడియా, సోషల్ మీడియా చేస్తున్నప్రచారంపైనా సెటైర్లు వేశారుు. వైసీపీ పరిస్థితి మెరుగు అయితే పార్టీ నేతలు ఎందుకు వెళ్లిపోతారని ఆర్కే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే టిక్కెట్లు ఇచ్చిన వారిలోచాలా మంది తమకు చాన్స్ ఇస్తే కూటమి నుంచి పోటీ చేస్తామని రాయబారాలు నడుపుతున్నారని ఆర్కేచెబుతున్నారు. ఎంతగా ప్రచారం చేయిచినా ప్రయోజనం లేదని ఆర్కే తేల్చేశారు.

అయితే కలికాలం అంతరించి మంచి కాలం వస్తుందని కూడా ఆర్కే పరోక్షంగా జగన్ కు హెచ్చరికలు పంపారు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో బీఆర్ఎస్ పరిస్థితిని చూపి హింట్ ఇచ్చారు.అంతేనా… షర్మిల కాంగ్రెస్ లో చేరి రాజకీయం చేస్తోంది 2029 ఎన్నికల కోసమేనని అంటున్నారు. అంటే.. అప్పటికే జగన్ జైల్లో ఉంటాడు.. పార్టీ మళ్లీ కాంగ్రెస్ గా మారిపోతుందని చెప్పకనే చెప్పారు. కలికాలం అంటూ జగన్ అన్న ఒక్క మాటతో ఆర్కే ఇంత ర్యాగింగ్ చేశారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close