ఆర్కే పలుకు : కేసీఆర్ కథ అడ్డం తిరిగింది !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీ వారాంతంలో రాసే కొత్త పలుకులో ఈ సారి కాస్త విజయగర్వం కనిపించింది. తాను చాలా కాలంగా కేసీఆర్ కు ఇస్తున్న సలహాలు పెడచెవిన పెట్టిన కారణంగా ఇప్పుడు నిండా ఇరుక్కుపోయారన్న భావనలో ఆయన కేసీఆర్‌కు పరోక్షంగా సుద్దులు చెప్పిన అంశంగా స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యేల ఎర కేసు సీబీఐకి వెళ్లడంపై ఆయన చాలా లోతుగా విశ్లేషణ జరిపారు. అయితే ఈ విశ్లేషణ అంతా.. పూర్తిగా కేసీఆర్ ను .. బీఆర్ఎస్‌ను భయ పెట్టడానికే అన్నట్లుగా సాగిపోయింది. హైకోర్టు జడ్జిమెంట్‌లో అసలు కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించింది. ఇదే అంశం ఆధారంగా కేసీఆర్ ను కేంద్రం బుక్ చేయబోతోందని.. ఆర్కే చెబుతున్నారు.

అంతే కాదు… కేసీఆర్ మాటలు విని పోలీసు అధికారులు స్టీఫెన్ రవీంద్ర, సీవీ ఆనంద్ కూడా ఇరుక్కున్నారని.. వారిని కూడా సీబీఐ ప్రశ్నిస్తుందని ఆర్కే చెబుతున్నారు. ఓ రకంగా ఆర్కే పోలీసుల్లో… ప్రభుత్వం చెప్పిన మాటలు వినకుండా భయాందోళనలు కల్పించారని అనుకోవచ్చు. ఫామ్ హౌస్ కేసు పూర్తిగా ట్రాప్ అని.. పెగాసస్ లాంటి సాఫ్ట్ వేర్లతో నిఘా పెట్టి.. అన్నీ రికార్డు చేసిన తర్వాత పట్టుకున్నారని.. అవన్నీ సీబీఐ దర్యాప్తులో బయటకు వస్తాయన్నట్లుగా ఆర్కే హింటిచ్చారు. తన వ్యాసం అంతా.. ఆర్కే ఇలాగే చెప్పారు. గతంలో బీజేపీతో పెట్టుకోవద్దని ఆయనచాలా సార్లు కేసీఆర్ కు తన ఆర్టికల్ ద్వారా పరోక్షంగా సలహాలిచ్చారు. కానీ కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు ఆర్కే.. తాను చెప్పిందే నిజమవుతుందన్నట్లుగా రాశారు.

ఇక ఏపీ రాజకీయాల గురించి రాయకుండా.. ఆర్కే కథనం పూర్తి కాదు కాబట్టి… ఏపీలో ముందస్తు ఎన్నికలపైనా రాశారు. జగన్ .. ప్రధాని మోదీని ముందస్తు ఎన్నికలకు సహకిరంచాలని కోరితే.. మీరే ఆలోచించుకోవాలని మోదీ చెప్పారని.. ఆర్కే రాసుకొచ్చారు. ఇక్కడ ఎప్పట్లాగే.. ఆయనకు ఎలా తెలిసిందనే సందేహం వస్తుంది. నిజమో కాదో ఎవరికీ తెలియదు. కానీ.. వైసీపీలో మాత్రం అతంర్గత సంక్షోభం ముదిరిపోతోందని.. ఐదారుగురు ఎంపీలు.. ఇరవై మంది వరకూ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆర్కే మైండ్ గేమ్ ఆడుతున్నారా లేకపోతే.. ఎవరైనా వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనతో టచ్ లోకి వచ్చారా అన్నది కవర్ చేసుకున్నారు. అయితే చంద్రబాబు,లోకేష్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మాత్రం తేల్చేశారు.

ఆర్కే రాతల్లో ఇటీవలి కాలంలో కనిపిస్తున్నవి.. తెలంగాణలో అయితే కేసీఆర్‌కు పరోక్షంగా సలహాలివ్వడం.. ఏపీలో అయితే.. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పడం. ఈ సారి కూడా ఆ ట్రెండ్ మార్చలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close