తెలంగాణా తెదేపా నేతలను లొంగదీసేందుకేనా?

మొదట రేవంత్ రెడ్డి.. ఆ తరువాత వరుసగా సెబాస్టియన్, ఉదయ్ సింహ, సండ్ర, వేం నరేందర్ రెడ్డిలకు ఎసిబి అధికారులు ఓటుకి నోటు కేసులో నోటీసులు జారీ చేసారు. వారిలో ఒక్కవేం నరేందర్ రెడ్డిని తప్ప మిగిలిన వారినందరినీ జైలుకి కూడా పంపారు. ఇప్పుడు తాజాగా వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ కి నోటీసులు జారీ చేసారు. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కృష్ణని రేపటి లోగా తమ ముందు హాజరు కమ్మని ఆదేశిస్తూ నోటీసు జారీచేసారు. ఈ కేసుతో అతనికి సంబంధం ఉందా లేదా అనే విషయం విచారణలో తేలవచ్చును. కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న అతనికి నోటీసులు జారీ చేయడం ద్వారా అతని ఉద్యోగంపై, సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని ఎవరయినా తేలికగానే ఊహించవచ్చును. కనుక సహజంగానే వేం నరేందర్ రెడ్డి కుటుంబం కూడా దీని వలన తీవ్ర ఒత్తిడికి గురికావచ్చును. బహుశః ఈ నోటీసు పంపడం వెనుక అసలు ఉద్దేశ్యం కూడా అదే అయి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

వేం నరేందర్ రెడ్డిని ఇదివరకు ఎసిబి అధికారులు ప్రశ్నించినప్పటికీ ఆయన వారడిగిన అన్ని ప్రశ్నలకు చాలా నిబ్బరంగా సమాధానాలు చెప్పినట్లు వార్తలు వచ్చేయి. కనుక ఈవిధంగా ఆయనని ఒత్తిడికి గురిచేసినట్లయితే తెరాసవైపు ఆకర్షించవచ్చనే ఆలోచనతోనే ఆయన కుమారుడికి నోటీసులు పంపి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అదే నిజమయితే తెలంగాణాలో మిగిలిన తెదేపా నేతలను లొంగదీసుకోవడానికి తెరాస ప్రభుత్వం ఇదే అస్త్రం ప్రయోగిస్తుందేమో? ఓటుకి నోటు కేసులో తెరాస ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేకపోయినా ఈవిధంగా ఆయన పార్టీకి చెందిన నేతలపై ఒత్తిడి తెస్తూ వారిని తెరసలోకి ఆకర్షించాలని ప్రయత్నిస్తోందేమో? రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close