పరబాషా తారలపై మాట మార్చిన హేమ

నటి శ్రీరెడ్డి అర్థనగ నిరసన అనంతరం మా ఆగ్రహౌదగ్రమైంది. వారేవో ఆరోపణలు చేశారు. అయితే ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడిన మాటలు గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా వుండటం మీడియా గమనించింది. ఒక యూ ట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో హేమ పరభాషా నటీమణులపై అవకాశాలివ్వడంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హీరోలకు తల్లులుగా వేయడానికి మేము పనికిరామా అని నిలదీశారు. ఆ సందర్భంలో ప్రత్యేకంగా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పేరు కూడా పలుసార్లు ప్రస్తావించారు. పూరిఅన్న కూడా అలాగే అంటాడు నవ్వుతాడు అంటూ చురకలంటించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు తల్లిగా నేనే వేయలేనా అని ఫ్రశ్నించారు. ఇవేగాకుండా ఇంకా అనేక విధాల ఆవేదన వెళ్లగక్కారు. అలాటి హేమ ఇప్పుడు శ్రీరెడ్డికి సమాధానం ఇచ్చేందుకోసం ఇతర భాషల వారికే అవకాశాలు వస్తాయనడం సరికాదని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ప్రతిభను బట్టే అవకాశాలు వస్తాయి అంటూ మొదట శ్రీలక్ష్మి తర్వాత కోవై సరళ ఇప్పుడు తాను ఇలా అవకాశాలు పొందామని వివరించారు. నిజానికి ఆ ఇద్దరికీ వచ్చిన స్టార్‌ డం ఈమె కంటే చాలా ఎక్కువ. శ్రీలక్ష్మి శైలి పూర్తిగా వేరు. ఇక కోవై సరళ ఇప్పటికీ స్టారే. వారితో పోలిస్తే హేమ అంత కీలకమైన పాత్రలు వేసింది తక్కువనే చెప్పాలి. కాబట్టి ఈ ఉదాహరణ కూడా పూర్తిగా నిజం కాదు. మరి సందర్భాన్ని బట్టి సర్దిచెప్పడానికి ఈ మాటలు చెప్పి వుంటారనిసరిపెట్టుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.