బీజేపీకి సీనియ‌ర్ హీరోయిన్ గుడ్ బై!

ప్ర‌ముఖ న‌టి గౌత‌మి… బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేర‌కు ఆమె ట్విట్ట‌ర్ లో ఓ పోస్ట్ పెట్టారు. గ‌త పాతికేళ్లుగా గౌత‌మి బీజేపీలోనే ఉన్నారు. 2021 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. పార్టీలో త‌నకు గౌర‌వం ల‌భించ‌డం లేద‌ని, కొంత‌మంది వ్య‌క్తులు త‌న‌ని న‌మ్మించి మోసంచ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ గౌత‌మి పార్టీని వీడారు. అంతే కాదు.. ఇంత కాలం త‌న‌కు స‌న్నిహితుడిగా మెలిగిన అగ‌ళ‌ప్ప‌న్ అనే వ్య‌క్తిపైనా గౌత‌మి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. త‌న బ‌ల‌హీన‌త‌ల్ని, అవ‌స‌రాల్ని ఆస‌రాగా చేసుకొని అళ‌గ‌ప్ప‌న్ త‌న జీవితంలోకి ప్ర‌వేశించాడ‌ని, ఆర్థిక లావాదేవీల విష‌యంలో త‌న‌ని మోసం చేశాడ‌న్న విష‌యాన్ని ఇటీవ‌లే గుర్తించాన‌ని, ఈ విష‌య‌మై పోలీసుల‌కు ఫిర్యాదు కూడాచేశార‌ని గౌత‌మి పేర్కొన్నారు. అయితే కొంత‌మంది బీజేపీ పెద్ద‌లు అళ‌గ‌ప్ప‌న్‌కి అండ‌గా నిల‌బ‌డ్డార‌ని, ఈ విష‌యంలో తన‌కి న్యాయం జ‌ర‌క్కుండ‌ద అడ్డుగా నిల‌బ‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మిళనాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌పై త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని, ఆయ‌నే త‌న‌కు న్యాయం చేస్తార‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్నాన‌ని గౌత‌మి పేర్కొన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన గౌత‌మి ఏ పార్టీలోకి వెళ్తార‌న్న విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఆమె కాంగ్రెస్ లో చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close