సింగరేణిలోకీ అదానీ ఎంట్రీ – కేసీఆర్ కూడా ఆపలేరు !

తెలంగాణలోని సింగరేణిలో అదానీ గ్రూప్ ఎంటరయ్యే అవకాశం కనిపిస్తోంది. సింగరేణి కోల్ మైన్స్ నిర్వహించిన టెండర్ ప్రక్రియలో అతి తక్కువ ధరతో అదానీ గ్రూప్ ఎల్-1 గా నిలిచారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌లలో మైనింగ్ ప్రక్రియతో పాటు ఆపరేషన్ల కోసం ఆహ్వానించిన సింగరేణి ఈ టెండర్లను ఆహ్వానించింది. అందరి కంటే తక్కువకు కోట్ చేసి అదానీ మొదటి స్థానంలో నిలిచారు. టెండర్ అదానీ గ్రూప్‌కు ఇవ్వక తప్పని పరిస్థితి.

ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌ సింగరేణికి ఎనిమిదేళ్ల కిందట కేటాయించారు. మరే సంస్థతో భాగస్వామ్యం లేకుండా పూర్తి షేర్లు సింగరేణికే ఉన్నాయి. అక్కడ బొగ్గు తవ్వకాలకు ఇటీవలే అనుమతి లభించింది. అన్ని రకాల అనుమతులు రావడంతో ఏటా 10 మిలియన్ టన్నుల మేర బొగ్గు తవ్వకాలు, ఆపరేషన్ కోసం సింగరేణి సంస్థ టెండర్లను ఆహ్వానించగా ఐదు కంపెనీలు ఆసక్తి చూపాయి. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నట్లు మోడీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ సర్కారు నిప్పులు చెరుగుతున్న సమయంలో సింగరేణి ఆధ్వర్యంలోని నైని కోల్ బ్లాక్ టెండర్‌లలో పాల్గొని మొదటి స్థానంలో నిలవడంతో ఇప్పుడు ప్రభుత్ నిర్ణయం ఎలా ఉంటుందన్న చర్చ ప్రారంభమయింది.

నైని కోల్ బ్లాక్ టెండర్ల ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగినట్లు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని పార్లమెంటు వేదికగా కూడా ప్రశ్నించారు. విదేశీ బొగ్గుకు అదానీ సంస్థ మన దేశంలో ఏకైక ఇంపోర్టర్‌గా ఉన్నదని, ఆ సంస్థకు లాభాలు చేకూర్చి పెట్టడానికే థర్మల్ విద్యుత్ ప్లాంట్లన్నీ తప్పనిసరిగా విదేశీ బొగ్గును బ్లెండింగ్ చేసేలా దిగుమతి చేసుకోవాలన్న నిబంధన తీసుకొచ్చారని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణిలోకి అదానీ ఎంట్రీని కేసీఆర్ అంగీకరిస్తారా ? అడ్డుకుంటారా అన్నది కీలకంగా మారింది. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికే మెజారిటీ వాటా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close