14 ఏళ్ళ తర్వాత ఆంధ్రాలోకి: మొక్కు తీర్చుకోనున్న కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్ళటం మొత్తంమీద ఖరారైపోయింది. ఈ నెల 22న జరిగే ఆ కార్యక్రమానికి వెళ్ళటంద్వారా 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఆంధ్రా నేలపై అడుగుపెట్టబోతున్నారు. తిరుమల వెంకన్నను దర్శించుకోవటం మినహా ఆంధ్రా ప్రాంతంలో ఈ 14 ఏళ్ళలో కేసీఆర్ పర్యటించటం ఇదే ప్రథమం.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిచే రోజులలో ఆంధ్రా ప్రాంతంలో విభజనను సమర్థించే కొందరు తలపట్టిన కార్యక్రమాలకు కేసీఆర్ హాజరవ్వాల్సిఉన్నా అది ఎందుకనో వాస్తవరూపు దాల్చలేదు. 2010 మే నెలలో కత్తి పద్మారావు వంటి కొందరు నేతలు జై ఆంధ్ర ఉద్యమం, ఏపీ దళిత మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు మద్దతుగా ఒక బహిరంగ సభను ప్లాన్ చేసి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆ సభ ‘లైలా’ తుపాను కారణంగా రద్దయిపోయింది. కేసీఆర్ కూడా చాలా సందర్భాలలో తాను ఆంధ్రా ప్రాంతంలో పర్యటించి విభజన అవసరాన్ని వివరిస్తానని, విభజనవలన ఆంధ్రా ప్రాంతానికి లాభముంటుందని చెబుతానని ప్రకటించారుకూడా. లగడపాటి రాజగోపాల్, టీడీ వెంకటేష్ వంటి కాంగ్రెస్ నేతలు ఈ ప్రకటనను ఆహ్వానించి, తాముకూడా తెలంగాణలో పర్యటించి సమైక్య ఆంధ్రప్రదేశ్ అవసరాన్ని వివరించటానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. అయితే శాంతి భద్రతల సమస్యల కారణంగా ఈ రెండింటిలో ఏదీ వాస్తవరూపు దాల్చలేదు.

మరోవైపు తెలంగాణ వస్తే తిరుమల శ్రీవారికి, బెజవాడ దుర్గమ్మకు, అజ్మీర్ దర్గాకు మొక్కుకున్న కేసీఆర్, పనిలో పనిగా అమరావతికి హాజరయ్యేముందు అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్నారు. కేసీఆర్ మొక్కులకోసం తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖనుంచి రు.5.59 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కొద్దిరోజులలో కేసీఆర్ తిరుమలకు, బెజవాడకు వెళ్ళి మొక్కు తీర్చుకుందమనుకున్నారని, అయితే అమరావతి కార్యక్రమం కారణంగా ఆ మొక్కును ముందుకు జరిపారని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close