ఇళ్ల స్థలాల పంపిణీ మళ్లీ వాయిదా..! ఈ సారి కరోనా కారణం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున అందరికీ ఇళ్ల పట్టాలిచ్చేస్తున్నామని.. కొద్ది రోజుల నుంచి ఉదరగొడుతున్న ప్రభుత్వం.. ఒక్క రోజు ముందు లబ్దిదారులకు షాక్ ఇచ్చింది. పంపిణీని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. దీనికి కారణం కరోనా అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం చేయదల్చుకుంటే.. కరోనా.. గిరోనా అడ్డం కాదని.. ఇప్పటి వరకూ చేస్తున్న పనులే నిరూపిస్తున్నాయి. అలాంటప్పుడు.. ఒక్క రోజు ముందు స్థలాల పంపిణీ ఎందుకు నిలిపివేశారన్నది సీక్రెట్‌గా మారింది.

నిజానికి స్థలాల పంపిణీ అనే విషయాన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చేస్తోంది. ఐదారు ముహుర్తాలు పెట్టింది. ఓ సారి స్థలాలు రెడీ కాలేదని..మరోసారి కరోనా అని.. మరోసారి స్థానిక ఎన్నికల వల్ల రమేష్ కుమార్ అడ్డుకున్నారని.. మరోసారి ఏ కారణం చెప్పకుండానే వాయిదా వేశారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్నప్పుడే అందరికీ పంపిణీ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా వాయిదా వేసుకుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ జయంతికి కంప్లీట్ చేయాలని అనుకున్నారు. అది కూడా.. ఇప్పుడు లెక్కలోకి రాలేదు. ఇక.. ఆగస్టు పదిహేనో తేదీన పంచుతామని చెబుతారన్న ప్రచారం.. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది.

నిజానికి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేంత భూమి ప్రభుత్వం వద్ద లేదు. ప్రైవేటులో కొని.. ప్లాటింగ్ చేశారు. కానీ అంతా చేసినా.. అవి శ్మశానాలు.. అడవులు.. కొండలపై ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఒక ఊరిలో.. మరో ఊరి వారికి స్థలాలు కేటాయించే ప్రయత్నాలు కూడా వివాదాస్పదవుతున్నాయి. అర్హులైన వారికి చాలా మందికి చోటు దక్కలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమస్యలన్నింటీ కారణంగా… ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ అపహాస్యం అవుతోందేమోనన్న అనుమానంతో ప్రభుత్వం వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు.

మరో వైపు.. పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కట్టిన ఇళ్లు వృధాగా పడి ఉన్నాయి. వాటి లబ్దిదారులు.. తమకు స్థలాలు వద్దని.. ఆ ఇళ్లనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీటిపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదో విధంగా అందరికీ ఇళ్ల స్థలాలిచ్చేశామని ఆత్రపడటమే తప్ప.. ఆలోచన లేకపోవడం వల్లే.. ఇలా ఓ పథకాన్ని పదే పదే వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని.. వైసీపీ నేతలే గొణుక్కుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close