ఎగురుతున్న విమానం ఇంజిన్ విఫ‌ల‌మైతే…

ఆస్ట్రేలియా నుంచి మ‌లేసియా వెడుతున్న ఎయిర్ ఏసియా విమానం తృటిలో ప్ర‌మాదాన్ని త‌ప్పించుకుంది. విమానం ఇంజిన్ ఫెయిల‌వ్వ‌డంతో ఒకే ఇంజిన్‌తో గంట‌న్న‌ర సేపు ప్ర‌యాణించింది. ఒక డొక్కు బ‌స్సులా శ‌బ్దం చేస్తూ, వాషింగ్ మెషిన్లా ఊగుతూ సాగించిన ఆ ప్ర‌యాణం ప్ర‌యాణికుల పైప్రాణాలు పైనే పోయేలా చేసింది. ఇంజిన్ విఫ‌ల‌మైన అంశాన్ని పైల‌ట్ ప్ర‌క‌టిస్తూ.. దైవ ప్రార్థ‌న చేయాల్సిందిగా ప్ర‌యాణికుల‌కు సూచించారు. వెంట‌నే ప్ర‌యాణికులు హ‌డ‌లెత్తిపోయారు. భూమికి వేల అడుగుల ఎత్తున చివురుటాకులా ఎగురుతున్న విమానం.. పెద్ద పెద్ద శ‌బ్దాలు. చేసేదేమీ లేక ప్ర‌యాణికులు ఎవ‌రి దారిని వారు వారి కుల‌దైవాల్ని ప్రార్థించుకున్నారు. దేవుడంటే న‌మ్మ‌కం లేని వారు సైతం మ‌న‌స్సులోనైనా దణ్ణం పెట్టుకుని ఉంటారు. పెర్త్ నుంచి కౌలాలంపూర్ బ‌య‌లుదేరిన ఈ విమానంలో సాంకేతిక లోపం ఏర్ప‌డ్డంతో వెన‌క్కి ర‌ప్పించారు. ఏ 330 ఎయిర్‌బ‌స్ డ‌గ‌డ‌గ‌లాడుకుంటూ వెనుతిరిగింది. అక్క‌డి నుంచి విమాన‌మంతా భ‌గ‌వ‌న్నామ‌స్మ‌ర‌ణ‌తో నిండిపోయింది. ఏ 330కి ఇది ఈ నెల రెండో ప్ర‌మాదమ‌ట‌. అదృష్ట‌వ‌శాత్తూ రెండు ప్ర‌మాదాల‌లోనూ ఎవ‌రూ గాయ‌ప‌డ‌కుండా త‌ప్పించుకోవ‌డం విశేషం.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close