కాలం కలసి రాకపోతే తాడే పాము అయి కరుస్తుందని పెద్దలు అంటారు. గుజరాత్లోని బీజే మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఇది నిజం అయింది. కరెక్ట్ మధ్యాహ్నం లంచ్ టైంలో వారంతా మెస్ లో కూర్చుని భోజనం చేస్తున్న సమయంలో వారి నెత్తి మీద విమానం కూలిపోయింది. ఎయిర్ పోర్టుకు కాస్త దగ్గరగానే ఉంది.. రోజూ విమానాలు గాల్లోకి లేస్తూంటాయి.ల్యాండ్ అవుతూంటాయి. అన్నీ చూస్తూంటారు. కానీ ఇలా తమ నెత్తి మీద కూలిపోతుందని ఎవరూ అనుకోలేదు.
బీజే కాలేజీ హాస్టల్ పైనే అహ్మదాబాద్ విమానం కూలిపోవడంతో ఇరవై మంది వరకూ మెడికోల చనిపోయినట్లుగా చెబుతున్నారు. చాలా మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో విమానంలో ఉన్న వారంతా చనిపోయారు. అది కూలిపోవడం వల్ల మెడికోలు చనిపోయారు. డాక్టర్లు అవ్వాలని ఎంతో కష్టపడుతున్న వారికి సంబందం లేకుండా.. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అసలు అలా జరుగుతుందని కూడా ఎవరూ ఊహించలేరు.
విమానం ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరు కూడా బతికే అవకాశం లేదని అ ప్రమాద దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కనీసం మృతదేహాలను కూడా గుర్తించే పరిస్థితి లేదు. అంత ఘోరమైన ప్రమాదం జరిగింది. విమానం రూపంలో పై నుంచి వచ్చి పడిన మృత్యువును వారూ ఊహించలేకపోయారు. ఈ షాక్ నుంచి మిగతా విద్యార్థులూ కోలుకోవడం కష్టం.