బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హైదరాబాద్ లో పెట్టుబడులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతకంటే ముందే కొన్ని పెట్టుబడులు పెడుతున్నారు. అందులో మల్టీప్లెక్స్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్ కర్మాన్ ఘాట్ ప్రాంతంలో దేవగన్ సినెక్స్ పేరుతో ఏడు స్క్రీన్ల మల్టీప్లెక్స్ ప్రారంభిస్తున్నారు.
జర్మన్ ఘాట్ ప్రాంతంలో టీఎన్ఆర్ ప్రెస్టన్ మాల్ ను కొనుగోలు చేారు. ఇప్పుడు కొలిసియం మాల్ గా పేరు మార్చారు. విశ్వ సముద్ర గ్రూప్ తో కలిసి అజయ్ దేవగన్ పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే ఏడాది ఈ మల్టిప్లెక్స్ ప్రారంభం కానుంది. కొలిసియం మాల్ ప్రాజెక్ట్ 2010లోనే టీఎన్ఆర్ గ్రూప్ ప్రారంభించింది. 3.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ మాల్, 7 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంతో షాపింగ్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సమగ్ర కేంద్రంగా రూపొందించారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్ వంటి ప్రముఖ ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో. మంచి మాల్ అవుతుందనుకున్నారు.
కానీ బిల్డర్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవడంతో ప్రాజెక్ట్ బాగా ఆలస్యం అయింది. చేతులు మారిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పేరు ‘కొలిసియం మాల్’గా మార్చారు. అజయ్ దేవగన్ మొదట ఎన్ వై సినిమాస్ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. తర్వాత విశ్వ సముద్ర గ్రూప్తో మెర్జర్ చేసి ‘దేవ్గన్ సినెక్స్’గా మార్చారు. విశ్వ సముద్ర గ్రూప్, ఇన్ఫ్రా, రియల్టీ, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ప్రముఖంగా ఉంది. ఈ గ్రూప్కు సీఈఓ సీ. శశిధర్. నవయుగ గ్రూప్ కుటుంబ సభ్యుడు. 2024లో నవయుగ నుంచి విడిగా ప్రారంభమైన విశ్వ సముద్ర, ఇప్పుడు దేవ్గన్ సినెక్స్లో ముఖ్య భాగస్వామిగా మారింది.
ఈ రెండు సంస్థలు కలిసి హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అందులో ఫిల్మ్ స్టూడియో కూడా ఉండే అవకాశం ఉంది.