ఎన్సీఎల్టీలో కేసు తేలకుండా స్టే తెచ్చిన అలంద మీడియా..! విచారణ జరిగితే ఏమవుతుంది..?

టీవీ9 వాటాల అమ్మకం వివాదంలో.. హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో విచారణపై అలంద మీడియా సంస్థ స్టే తీసుకు వచ్చింది. ఎలాంటి విచారణ జరపకూడదని… ఆ సంస్థ ఢిల్లీలోని ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అక్కడ జూలై 12 వరకూ ఎలాంటి ప్రొసిడీంగ్స్ వద్దని స్టే తెచ్చుకుంది. దాంతో.. ఈ రోజు ఎన్సీఎల్టీలో జరగాల్సిన కేసు విచారణ వాయిదా పడింది. హీరో శివాజీ… ఈ కేసును దాఖలు చేశారు. తనకు.. రవిప్రకాష్..కొన్ని షేర్లు అమ్మారని.. వాటి బదలాయింపు జరగలేదని.. ఆ లోపే… సంస్థ యాజమాన్యం మారిందనేది.. ఆ కేసు. ఈ కేసు విచారణ జరిగితే… టీవీ9 అమ్మకం విషయంలో.. కొత్త సందేహాలు, ఇక్కట్లు వస్తాయన్న ఉద్దేశంతో.. అలంద మీడియా.. విచారణపై స్టే కోరినట్లు తెలుస్తోంది.

మరోవైపు శివాజీ కొన్నారని చెబుతున్న షేర్ల విషయంలో… ఒప్పందం.. ఆయన చెప్పినట్లు గత ఏడాది ఫిబ్రవరిలోనిది కాదని.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనిదేనని .. కొన్ని టీవీ చానళ్లకు…పోలీసులు లీకులు ఇచ్చారు. అవి.. రవిప్రకాష్ కు సంబంధించిన కంప్యూటర్ల నుంచి స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… టీవీ9 ఆఫీసులోని రవిప్రకాష్ చాంబర్‌లో ఇతర చోట్ల ఏడు హార్డ్ డిస్క్‌లను తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అందులో నుంచి.. ఈ ఈమెయిల్స్ రీట్రివ్ చేసినట్లు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా.. ఈ ఏప్రిల్‌లో చేసుకున్న ఒప్పందాన్ని… గత ఫిబ్రవరిలో చేసుకున్నట్లు చెబుతున్నారని.. ఇదో పెద్ద స్కాం అని.. సైబరాబాద్ పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు.

వాస్తవంగా ఇది పెద్ద సాక్ష్యం అయితే పోలీసులు ముందుగా… దీన్ని విచారణ సంస్థల ముందు ప్రజెంట్ చేయాలి. కానీ తమ లక్ష్యం అది కాదన్నట్లుగా.. కేవలం మీడియాకు సమాచారం ఇస్తే చాలన్నట్లుగా.. వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ ఈమెయిల్స్ కానీ..తాము బయటకు వెల్లడిస్తున్న సమాచారం కానీ ఏదీ అధికకారికం కాదు. తమకు సంబంధం లేదని..సైబర్ పోలీసులు చెబుతారు. ఎందుకంటే.. ఇలా లీక్ చేయడం చట్ట విరుద్ధం. అయినప్పటికీ… ఓ రకమైన ప్రచారం జరగడం..రవిప్రకాష్, శివాజీలు.. టీవీ9 అమ్మకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని.. దాని కోసం అడ్డదారులు తొక్కారనే విషయాన్ని ప్రచారం చేయాడానికే.. ఈ తరహా ప్రచారం చేస్తున్నారని.. కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి జూలై 12 వరకూ.. ఎన్సీఎల్టీలో కేసు విచారణకు రాదు కాబట్టి.. అప్పటి వరకూ.. టీవీ9 అమ్మకం వివాదం కొనసాగే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close