నాదెండ్లను టెన్షన్ పెడుతున్న ఆలపాటి రాజా !

తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా ఫిక్స్ అయిపోయారు. . తెనాలిలో జనసేన అభ్యర్థిగా మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను ఎంపిక చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దాదాపు ఆరు నెలల క్రితమే ప్రకటించారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ కూడా తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు.

టిక్కెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ సిద్ధమవుతున్నారు. గుంటూరులో మంగళవారం తన అనుచరులు, నియోజకవర్గం ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తనకు టిక్కెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని చెప్పారు. బుధవారం తెనాలిలో టిడిపి కార్యకర్తలతో రాజేంద్రప్రసాద్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. టిడిపి నిర్వహించిన సర్వేలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు గెలుపు అవకాశాలున్నాయని నివేదికలొచ్చినట్లు చెబుతున్నారు.

జనసేన పార్టీలో పవన్‌ కల్యాణ్‌ తరువాత అన్ని తానై చూస్తూ నంబరు-2గా పేరొందిన నాదెండ్ల మనోహర్‌కే ఆదిలోనే సమస్యలు ప్రారంభం అయ్యాయి. టిడిపి, జనసేన పొత్తుపై ఎన్నికలకు ముందుగానే అంతర్గత కలహాలు పెరుగుతుండటంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా చోటుచేసుకుంటాయోనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఆలపాటి రాజాను చంద్రబాబు బుజ్జగిస్తారని జనసైనికులు నమ్మకంగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close