అలీ ఎక్క‌డ‌.. క‌నిపించ‌డే?

టీడీపీ, జ‌న‌సేన నుంచి సీటు ఆశించి భంగ‌ప‌డి, వైకాపా గూటికి చేరిన‌వాళ్ల‌లో అలీ ఒక‌డు. కేవ‌లం వైకాపా త‌న‌కు సీటు ఇస్తుంద‌న్న కార‌ణంతోనే స్నేహితుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని కూడా దూషించే సాహ‌సానికి ఒడిగ‌ట్టాడు అలీ. అయితే అందుకు త‌గిన ప్ర‌తిఫ‌లం మాత్రం ద‌క్క‌లేదు. ఏదో గౌర‌వ స‌ల‌హాదారు పోస్టు ఇచ్చి, అలీని కాస్త బుజ్జ‌గించే ప్ర‌యత్నం చేసింది జ‌గ‌న్ పార్టీ. 2024 ఎన్నిక‌ల్లో అయినా త‌న‌కు త‌గిన గౌర‌వం ఇస్తార‌ని, ఎం.ఎల్.ఏగా అసెంబ్లీకి పంపిస్తార‌ని అలీ ఆశించాడు. కానీ.. ఈసారీ అలీకి మొండిచేయ్యే ఎదురైంది. దాంతో అలీ వైకాపాపై గుర్రుగా ఉన్నాడు. అస‌లు ఈ ఎన్నిక‌ల‌తో త‌న‌కు సంబంధ‌మే లేద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప్ర‌చారంలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. టాలీవుడ్ నుంచి వైకాపాకు నేరుగా మ‌ద్ద‌తు ఇస్తోంది ఇద్ద‌రే ఇద్ద‌రు. ఒక‌రు అలీ, ఇంకొక‌రు పోసాని కృష్ణ‌ముర‌ళి.

అలీ ది ఒక బాధైతే, పోసానిది మ‌రో బాధ‌. వైకాపా గూటికి చేరి, ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడి, చిత్ర‌సీమ‌లో కొత్త శ‌త్రువుల్ని సంపాదించుకొన్నాడు పోసాని. ఇప్పుడు ఆయ‌న‌కు పెద్ద‌గా సినిమా అవ‌కాశాల్లేవు. వైకాపా టికెట్టూ ఇవ్వలేదు. పోసాని మాట్లాడిన ప్ర‌తీ మాటా.. వైకాపాకు డామేజీగా మారుతోంది. అలీ వైకాపా త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డు. పోసాని చేసినా ఉప‌యోగం లేదు. అలీ త‌న‌కు ఇచ్చిన గౌర‌వ స‌ల‌హాదారు పోస్టునీ పెద్ద‌గా పట్టించుకోవ‌డం లేద‌ట‌. అస‌లు త‌న‌కు అలాంటి పోస్ట్ ఇచ్చిన‌ట్టే ప్ర‌వ‌ర్తించ‌డం లేద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాక‌పోతే, ఈ నామినేటెడ్ ప‌దువుల‌న్నీ తూచ్ అంటాయి. ఈలోగా ఈ ప‌ద‌వుల‌పై ప్రేమ ఎందుక‌నో ఏమో.. అలీ పూర్తిగా లైట్ తీసుకొన్నాడు. ప్ర‌చారంలోనూ క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌లు పూర్త‌య్యాక ఆయ‌న వైకాపా పార్టీకి గుడ్ బై చెబుతార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close