ఆలియా ఇంట్లో అల్లు ఫ్యాన్స్ డిమాండ్

ఆలియా భట్ తెలుగు తెరకు దగ్గరౌతుంది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ద్వార మొదటి తెలుగు సినిమా సంతకం చేసింది. ఇప్పుడా సినిమా విడుదల కాకముందే మరో తెలుగు సినిమా ఒప్పుకుంది. ఎన్టీఆర్ కొరటాల కలయికలో రాబోతున్న సినిమాలో అలియాని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అయితే ఈ రెండే కాకుండా ఆమె మనసులో మరో టాలీవుడ్ హీరోతో సినిమా చేయాలని వుంది. ఆయనే అల్లు అర్జున్. ప్రస్తుతం ముంబాయిలో తెలుగు మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తుంది అలియా. ఇందులో బాగంగా అల్లు అర్జున్ పై తనకున్న ఇష్టాన్ని తెలియజేసింది.

”అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ వుంది. ఇది నా ఇష్టమే కాదు మా ఇంట్లో డిమాండ్ కూడా. పుష్ప చూసిన తర్వాత మా ఇంట్లో అంతా బన్నీకి ఫ్యాన్స్ అయిపోయారు. నన్ను ఇంట్లో ఆలు అని పిలుస్తారు. అల్లు తో ఆలు సినిమా ఎప్పుడు ? అని అడుగుతున్నారు. అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం వస్తే మరో ఆలోచన లేకుండా ఒప్పుకుంటా. అల్లు అర్జున్ నా ఫేవరేట్ స్టార్” అని తన మనసులో మాట బయటపెట్టింది అలియా.

పుష్ప సినిమా బాలీవుడ్ లో కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. బన్నీ యాక్షన్ కి ఫిదా అయిపోయారు బాలీవుడ్ ఆడియన్స్. ఇకపై అల్లు అర్జున్ చేసే సినిమాలు దాదాపు బాలీవుడ్ వెళ్తాయి. అలియా బాలీవుడ్ లో టాప్ స్టార్. షో.. అల్లు, ఆలు కాంబినేషన్ కుదరడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చనే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close