ప‌వ‌న్ మ‌రో ఎంజీఆర్‌

ప‌వన్ క‌ల్యాణ్‌ని అల‌నాటి ఎంజీఆర్‌తో పోల్చారు ఏ.ఎం.ర‌త్నం. ఖుషి చిత్రానికి ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రానికీ ఆయ‌నే నిర్మాత‌. బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి ర‌త్నం అతిథిగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఖుషీ రోజుల్ని గుర్తు చేసుకొంటూ ఎంజీఆర్‌తో పోల్చారు.

ఎంజీఆర్ త‌న సినిమాల్లోని ఓ పాట‌ని సందేశాత్మ‌కంగా తెర‌కెక్కిస్తార‌ని, ఆ అల‌వాటు ప‌వ‌న్‌కీ ఉంద‌ని చెప్పారు. ఖుషి లోని ఏ మేరా జ‌హా.. పాట‌ని ఈ సంద‌ర్భంగా ఉద‌హ‌రించారు. ఓ తెలుగు సినిమాలో హిందీ పాట‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేర‌ని, అది ప‌వ‌న్ ఆలోచ‌న నుంచి పుట్టిన పాట అని, ఆ పాట ఎలా ఉండాలో, ఎలాంటి ప‌దాలు వాడాలో.. ర‌చ‌యిత‌కు చెప్పి మ‌రీ రాయించార‌ని ర‌త్నం గుర్తు చేసుకొన్నారు. ప‌వ‌న్ జ‌నం మెచ్చే నాయ‌కుడిగా ఎదుగుతున్నార‌ని, త్వ‌ర‌లోనే జాతీయ నాయ‌కుడూ అవుతాడ‌ని జోస్యం చెప్పారు. అంతే కాదు.. అభిమానులు అర‌వ‌డం కాద‌ని, ఓట్లు వేయాల‌ని హిత‌వు ప‌లికారు.

ఇన్ని చెప్పినా ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ అప్ డేట్ మాత్రం ఇవ్వ‌లేదు. ఈ సినిమా షూటింగ్ అర్థాంత‌రంగా ఆగిపోయింది. దాంతో ర‌త్నం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని బ‌య‌ట టాక్‌. అయితే ర‌త్నం మాత్రం ప‌వ‌న్‌ని పొగుడుతూ ఎంజీఆర్‌తో పోల్చ‌డం చూస్తుంటే ఆయ‌న‌కు ‘వీర‌మ‌ల్లు’ టెన్ష‌న్ ఏమాత్రం లేన‌ట్టే క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close