చీరాల నుంచి ఇండిపెండెంట్ గా ఆమంచి పోటీ

వైసీపీలో జగన్ రెడ్డి మాటల్ని వినే నేతలు తగ్గిపోయారు. తాజాగా పర్చూరుకు కొత్త అభ్యర్థిని జగన్ రెడ్డి వెదుక్కోక తప్పని పరిస్థితి ేర్పడింది. చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులకు చెప్పారు. చీరాలలో కరణం వెంకటేష్ కే టిక్కెట్ అని ఆయనను మార్చేందుకు జగన్ ఇష్టపడకపోవడంతో అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించిన ఆయన.. చీరాలలోనే పోటీ చేయబోతున్నానని ఏదైనా పార్టీ తరపునా లేదా ఇండిపెండెంట్ గానా అన్నది త్వరలో డిసైడ్ చేస్తానని అనుచరులకు చెప్పారు.

చీరాలో బలమైన నేత అయిన ఆమంచిని జగన్ పర్చూరుకు పంపారు. అక్కడ గెలిచే అవకాశం లేదని మొదటి నుంచి స్పష్టత ఉంది. అందుకే చీరాలలో తన అనుచరులతో ఎప్పుడూ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చివరికి అయినా తనకు టిక్కెట్ కేటాయిస్తారనుకున్నారు. కానీ జగన్ కు అలాంటి ఆలోచన లేకపోవడతో ప్లాన్ బీ అమలు చేస్తున్నారు. ఓ సారి కాంగ్రెస్.. మరోసారి ఇండిపెండెంట్ గా ఆమంచి చీరాల నుంచి గెలిచారు.

ఆయన సోదరుడు స్వాములు ఇప్పటికే జనసేనలో చేరారు. ఆమంచి జనసేనలో చేరితే చీరాల టిక్కెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఆయన కూడా అదే ఉద్దేశంతో స్వముల్ని పార్టీలోకి పంపారని అంటున్నారు. వచ్చే పది రోజుల్లో ప్రకాశం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందులో ఆమంచి కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close