విభజన చట్టం ప్రకారమే రాజధానిగా అమరావతి ఖరారు : కేంద్రం

అమరావతి విషయంలో ఇప్పటి వరకూ ఇటూ ఇటూ కాకుండా ఉంటూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అమరావతి వైపు క్లియర్ గా నిలబడింది. అమరావతి రాజధాని విభజన చట్టం ప్రకారం ఏర్పడిందని స్పష్టం చేస్తూ.. లోక్ సభలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా అని ఆయన ప్రశ్న వేశారు. దీనికి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఏపీ రాజధాని అంశం ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కరణ అవుతుందన్నరు.

అణరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం 2015లోనే నోటిపై చేసిందని నిత్యానందరాయ్ తన సమాధానంలో స్పష్టం చేశారు. విభజన చట్టంలోని ఐదు, ఆరు సెక్షన్ల ప్రకారమే అమరావతి ఏర్పాటయిందని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రి సమాధానంతో అమరావతి రాజధాని విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏపీ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల చట్టాలు.. మళ్లీ వెనక్కి తీసుకున్నా.. అసలు అలాంటి వాటిపై తమను సంప్రదించలేదని కేంద్రం చెబుతోంది. మూడు రాజధానుల కోసం చేసిన చట్టాలతో తమకు సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ స్పందన ప్రకారం.. అమరావతి రాజధానిగా నిర్ణయం అయిపోయింది… ఇక కొత్తగా విభజన చట్టంలో మార్పులు చేయకుండా ఎలాంటి రాజధానులు ఏర్పాటు చేయలేరని చెప్పినట్లయిందని నిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టుకు కూడా ఇదే చెబితే… ఇక ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల నాటకం ముగిసిపోతుందని.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని గెలిపించండి: చిరంజీవి

ప‌వ‌న్ ని గెలిపించ‌డానికి చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్ ని గెలిపించాల‌ని, జ‌నం కోసం ఆలోచించే ప‌వ‌న్‌ని చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపాల‌ని ఆయ‌న ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు...

ప్ర‌భాస్ కు ‘హీరోయిన్‌’తో స‌మ‌స్యే!

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 1945 నేప‌థ్యంలో సాగే పిరియాడిక‌ల్ డ్రామా ఇది. యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ‌. ఈ సినిమాలో హీరోయిన్...

ఉక్క‌పోత‌… ఈసీతో పోరుకు వైసీపీ సిద్ధం!

ఫ్యాన్ గాలికి తిరుగులేదు... మేమంతా సిద్ధం అంటూ వైసీపీ చేస్తున్న ప్ర‌చారం తేలిపోతుంది. ఆ పార్టీకి గ్రౌండ్ లోనూ ఏదీ క‌లిసి రావ‌టం లేదు. అంతా తానే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌గ‌న్ కు...

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close