సైకోయిజం : వాళ్ల చెక్కును వెనక్కి పంపేసిన అంబటి !

బిడ్డ డ్రైనేజీ పనుల్లో చనిపోతే… వచ్చిన ఐదు లక్షల్లో రూ. రెండున్నర లక్షలు వాటా అడిగిన అంబటి రాంబాబు వ్యవహారం గత నెలలో సంచలనం అయింది. తనకు ఇమ్మన్న రెండున్నర లక్షలు ఇవ్వకుండా మీడియాకు ఎక్కి రచ్చ చేస్తారా అని పగబట్టిన అంబటి రాబాబు… వారికి మంజూరైన చెక్కును వెనక్కి పంపేశారు. ఇప్పుడు ఆ బాధితులకు చెక్కు అందలేదు. పరిహారం వెనక్కి పోయిందని చెబుతున్నారు. మంజూరైన చెక్కును ఇవ్వకుండా…. వెనక్కి పంపిన అంబటి వ్యవహారశైలి ఇప్పుడు సత్తెనపల్లిలో చర్చనీయాంశం అవుతోంది.

కన్నబిడ్డను కోల్పోయిన వాళ్లు .. వచ్చే పరిహారంతో అయినా ఎలాగోలా బతకాలనుకున్నారు. కానీ రాజకీయ రాబందులు వారిని బతకనివ్వడం లేదు. అంబటి రాంబాబు రెండున్నర లక్షలు అడిగారని జనసేన నాయకుల సాయంతో వారు మీడియా ను ఆశ్రయించారు. దీంతో అయినా ఉలిక్కి పడి.. ఆ బాధితులకు న్యాయం చేశామని నిరూపించుకోవాల్సిన ప్రభుత్వం వారికి చెక్కులు ఇవ్వలేదు. నిజానికి ఆ చెక్కు మంజూరు అయింది. ఆర్డీవో దగ్గరకు వచ్చింది. ఇక పంపిణీ చేయడమే మిగిలింది. కానీ వాటా ఇవ్వకపోవడం వల్ల రాజకీయ ఆదేశాలతో ఆగిపోయింది.

ఆ బాధితులు మీడియాకు ఎక్కడంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. తమ సొమ్మేదో ఇస్తున్నట్లుగా వారు వెంటనే.. కుట్రలు ప్రారంభించారు. ఆ చెక్కు కనిపించడం లేదని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు వెనక్కి పంపేసినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. అసలు పాలనలో సైకోయిజం అంటే ఇదేనని మండి పడుతున్నారు. తమ బిడ్డ ఉసురు పోసుకుంటారని శాపనార్ధాలు పెడుతున్నారు. కానీ పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికే పాలన అన్నట్లుగా ఉన్న ఈ రాజకీయ నాయకులకు అవేమీ కనిపించడం లేదు… వినిపించడం లేదు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close