ఏపీ బీజేపీకి రోడ్ మ్యాప్ ఇవ్వనున్న అమిత్ షా, నడ్డా !

హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా మూడు రోజుల వ్యవధిలో ఏపీలో పర్యటించబోతున్నారు. అమిత్ షా ఏపీలోని విశాఖలో ఎనిమిదో తేదీన బహిరంగసభకు హాజరవ్వాల్సి ఉంది. కారణం ఏదైనా మూడు రోజులుకు వాయిదాపడింది . తిరుపతిలో మాత్రం జేపీ నడ్డా పదో తేదీన సమావేశం పెట్టనున్నారు. ఈ ఇద్దరు నేతల బహిరంగసభలపై ఈ సారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తమ పార్టీ నేతలకు వారు రోడ్ మ్యాప్ ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

జనసేన పార్టీ మాతోనే ఉందని బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. కానీ జనసేన మాత్రం తాము టీడీపీతో ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. అదే సమయంలో బీజేపీని ఎవరూ పట్టించుకోకుండా ఉండటం లేదు. రెండు పార్టీల అగ్రనేతలు.. బీజేపీ హైకమాండ్ వద్దకు పదే పదే వెళ్తున్నారు. తమపై చల్లని చూపు కొనసాగించాలని జగన్ అదే పనిగా బీజేపీ పెద్దల్ని కోరుతున్నారు. వారు అడిగిన పనులన్నీ చేస్తున్నారు. చంద్రబాబు కూడా బీజేపీ పెద్దల్ని కలుస్తున్నారు. ఆయనకూ బీజేపీతో కలవాలన్న ఉద్దేశం లేకపోతే.. కనీసం.. బీజేపీకి తాము దూరం కాదు అన్న అభిప్రాయాన్ని కల్పించడానికైనా ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఈ సమయంలో ఏపీలో ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాలా అన్నది బీజేపీ నేతలకు పజిల్ గా మారింది. అమిత్ షా, నడ్డాలు ఈ మేరకు వారికి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై రాజకీయం విమర్శలు చేస్తే.. వైసీపీకి ఈ సారి పరోక్ష మద్దతు ఉండదని చెప్పినట్లవుతుంది. తమ గొప్పలు చెప్పుకుని వెళ్తే… ఏపీలో బీజేపీ గురించి తాము పట్టించుకోవట్లేదని చెప్పినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే… నడ్డా, అమిత్ షాలు ఇచ్చే సందేశం కోసం ఏపీ బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close