మోడీని ప‌టేల్ స్థాయికి ఎత్తేస్తున్న‌ అమిత్ షా!

రెండోసారి ప్ర‌ధాని మంత్రి అయ్యాక న‌రేంద్ర మోడీ కొన్ని సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకున్నారు, దాన్ని ఎవ్వ‌రూ కాద‌న‌రు. ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దుగానీ, కాశ్మీరులో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు విష‌యంలోగానీ భాజ‌పా స‌ర్కారు చూపించిన చొర‌వ ప్ర‌శంస‌నీయ‌మే. అయితే, కాశ్మీరు విష‌యంలో మోడీ చూపించిన చొర‌వ‌ను ఏకంగా స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ స్థాయి ప్ర‌య‌త్నంగా అభివ‌ర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైద‌రాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడెమీలో జ‌రిగిన 70వ ఐ.పి.ఎస్. బ్చాచ్ పాసింగ్ అవుట్ సెర్మ‌నీలో పాల్గొన‌డానికి అమిత్ షా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… సుర‌క్ష భార‌త్ అనే నినాదంతో మోడీ సర్కారు ప‌నిచేస్తుంద‌న్నారు.

అప్ప‌ట్లో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ని ఉక్కు మ‌నిషి అన్నార‌నీ, ఇప్పుడు న‌రేంద్ర మోడీ కూడా ఉక్కు మ‌నిషే అని అమిత్ షా చెప్పారు. నిజాం పాల‌న‌లో ఉన్న హైద‌రాబాద్ తో స‌హా దాదాపు 500 సంస్థానాల‌ను విలీనం చేయ‌డంలో ప‌టేల్ కృషి మ‌రువ‌లేనిద‌నీ, అదే త‌ర‌హాలో న‌రేంద్ర మోడీ కూడా కాశ్మీరు అంశంలో చొరవ చూపించి ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేశార‌న్నారు. జ‌మ్మూకాశ్మీర్ కి విముక్తి క‌ల్పించ‌డంతో మోడీ చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌న్నారు. పాల‌కులు, సివిల్ స‌ర్వీసెస్ ఉద్యోగుల భుజాలపైనే దేశ భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంద‌న్నారు. సుర‌క్ష భార‌త్ ల‌క్ష్యాన్ని మోడీ పెట్టుకున్నార‌నీ, దాన్ని సాధించే దిశ‌గా ఐపీఎస్ లు ప‌నిచేయాల‌న్నారు. ప్ర‌జ‌ల్లో పోలీసుల‌పై, భ‌ద్ర‌త‌పై న‌మ్మ‌కం పెంచే విధంగా విధి నిర్వ‌హ‌ణ ఉండాల‌ని చెప్పారు.

నాడు సంస్థానాల విలీనం కోసం ప‌టేల్ తీసుకున్న చొర‌వ వేరు, ఇవాళ్ల కాశ్మీర్ లో 370 ర‌ద్దుకి మోడీ తీసుకున్న చొర‌వ వేరు. వాస్త‌వానికి, రెండింటినీ ఒకే త‌ర‌హా ప్ర‌య‌త్నం అని పోల్చ‌డ‌మే స‌రైంది కాదు. రెండూ ముఖ్య‌మైన అంశాలే, విడివిడిగా దేనిక‌దే ప్ర‌త్యేక‌మైంది. కానీ మ‌రీ ప‌టేల్ ఉక్కు మ‌నిషి అన్నార‌ని… మోడీని కూడా ఉక్కు మ‌నిషి అని అమిత్ షా అభివ‌ర్ణించ‌డం కాస్త అతిగా అనిపిస్తోంది. కాశ్మీరు అంశంలో మోడీ స‌ర్కారు చొర‌వ క‌చ్చితంగా ప్ర‌శంస‌నీయ‌మే, సాహ‌సోపేత నిర్ణ‌య‌మే. అయితే, ఈ నిర్ణ‌యం తీసుకునేందుకు కావాల్సిన‌ రాజ‌కీయ ప‌రిస్థితులు మోడీ స‌ర్కారుకు ఇప్పుడు అనుకూలించాయి. దీన్ని సంస్థానాల విలీనానికి ప‌టేల్ చూపిన చొర‌వ‌తో స‌రిపోల్చ‌లేం క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close