ముందస్తు మోడీ సాయంతోనా..? మోడీపై భయంతోనా ..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పై భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. ముందస్తుకు వెళ్లి ప్రజలపై భారం వేశారని విమర్శలు గుప్పించారు. షెడ్యూల్‌ ప్రకారం 2019లో ఎన్నికలు జరిగితే…మోదీ ప్రభావం తనపై పడుతుందని కేసీఆర్‌ భయపడ్డారన్నారు. అందుకే 9 నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఎన్నికల హామీలు ఏమీ అమలు చేయలేదని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైపోయిందని అమిత్‌షా ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదని కొడుకునో, కూతురునో సీఎం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని విర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తేల్చారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట తప్పారు, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు, ఇప్పటికీ తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయన్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్క లెక్చరర్‌ పోస్టును భర్తీ చేయలేదన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని… ఇప్పటివరకు 5 వేల ఇళ్లను కూడా నిర్మించలేదని విర్శించారు. తెలంగాణ అమరుల కుటుంబాలను కేసీఆర్‌ మోసం చేశారని మండిపడ్డారు.

తెలంగాణకు కేంద్రం రూ.99వేల కోట్లు కేటాయించినా… సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని అమిత్‌షా విమర్శించారు. రైతుల ఆత్మహత్యల పాపం టీఆర్‌ఎస్‌దేనని తేల్చారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేసిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని అమిత్ షా పిలుపునిచ్చారు. బీజేపీకి అవకాశమిస్తే…తెలంగాణలో అభివృద్ధి చేసి చూపుతామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17ను అధికారికంగా జరుపుతమన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే బీసీలకు నష్టమన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తేల్చారు. చంద్రబాబుపైనా అమిత్ షా విమర్శలు చేశారు. తెలంగాణలో మహాకూటమి గెలిస్తే… ఎంఐంఎంకు వ్యతిరేకంగా పోరాడగలదా? అని ప్రశ్నించారు. ఎంఐఎంను ఎదుర్కొనే దమ్ము బీజేపీకే ఉందన్నారు.

కరీంనగర్ సభలో అమిత్ షా… టీఆర్ఎస్ పై కాస్త కటువుగా మాట్లాడేందుకు ప్రయత్నించారు. తాము కూడా ప్రత్యామ్నాయమే అని చెప్పుకోవాలని ఆరాటపడ్డారు. ఈ విషయంలో… అమిత్ షా చేసిన ప్రసంగంపై సహజంగానే ఎన్నో అనుమానాలు తలెత్తుతాయి. బీజేపీ మద్దతు లేకుండా.. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం సాధ్యమయ్యే విషయం కాదు. అయినా అదంతా తమకు తెలియదన్నట్లుగా… కేసీఆర్ పై విమర్శలు చేశారు. పైగా.. నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరిపేందుకు ఈసీపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కేంద్రం 99వేల కోట్లు ఇచ్చిందని.. ఇక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మిగన్ భగీరధలకు.. నిదులివ్వాలని మొరపెట్టుకున్నా… నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేసింది. మొత్తానికి అమిత్ షా… అధికార వ్యతిరేక ఓటు చీల్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close