కలిపేసుకుందాం రా!

మూడోతరం వచ్చేసరికి తెలుగుదేశం స్వరూప స్వభావాలు మౌలికంగానే మారిపోయాయి. ఎన్ టి ఆర్ హయాంలో అన్ని రాజకీయ పార్టీలనూ కూడగట్టుకుని సారధ్యం వహించడమే పార్టీ ఉనికి, మనుగడల్లో ప్రధానంగా కనిపించేది. ఎన్ టి ఆర్ మాదిరిగా జనాకర్షణ లేని చంద్రబాబు నాయుడు హయాంలో కన్విన్సింగ్, లాబీయింగ్ లద్వారా పార్టీ మాటే పైచేయిగా వుండేలా చూశారు. కార్యకర్తలతో తప్ప నేరుగా ప్రజలతో ఇంతవరకూ ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోని నారా లోకేష్ సిద్దాంతమైతే ”ఎనలైజ్”, ”హాండిల్”,”మేనేజ్”.

అశోక్ గజపతిరాజు, కెఇకృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు వంటి ఏకొద్దిమందో తప్ప ఎన్ టి ఆర్ నాటి నుంచీ పార్టీలో వున్న వారు ప్రస్తుతం పార్టీలో లేరు. ఆ కొద్దిమందీ ‘మార్పులను’ తమకు అంటించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులా గౌరవాన్ని నిలబెట్టు కుంటున్నారు. మిగిలినవారందరూ చంద్రబాబు విధేయులే! వారి విధేయతను లోకేష్ కి ఎక్స్టెండ్ చేయడానికి అభ్యంతరం లేనివారే!

పార్టీని నిరంతరాయంగా నడపడానికి కమిట్ మెంటు వున్న కార్యకర్తల కంటే డబ్బే ముఖ్యమని అధికారంలో లేని పదేళ్ళలో బాగా అర్ధం చేసుకున్న బాబు ”పార్టీ పోషకుల”కే పెద్దపీట వేశారు. ప్రజాజీవనంతో సంబంధాలు లేకపోయినా సుజనాచౌదరి,నారాయణ, గంటా శ్రీనివాసరావు వగైరా వగైరా నిరంతర ఆదాయవనరులు వున్నవారు ఇవాళ అధికార పదవుల్లో వుండటానికి అదే మూలం.

చినబాబు లోకేష్ కూడా పార్టీని నడపడానికి తండ్రి అనుభవాన్నే పాఠంగా స్వీకరించారు. పార్టీకోసం అవసరమైతే ఆర్ధిక వనరులు సమకూర్చే సామర్ధ్యమే వెంకటేష్ ను రాజ్యసభకు పంపించింది.

ఇప్పటి రాటకీయాల్లో డబ్బు ప్రాధాన్యతను ఎవరూ తోసిపుచ్చలేరన్నది వాస్తవమే! అయితే, రాజకీయ ప్రత్యర్ధులను ఎలా ఎదుర్కొంటారు అనే విషయంలో కూడా రాజకీయ ప్రక్రియ కంటే ”వారిని కలిపేసుకుందాం!”అనే మార్గాన్నే తెలుగుదేశం అమలు చేస్తోంది.

ఈ ఆలోచన ప్రకారం రాజకీయాల్లో ప్రత్యర్ధులే వుండరు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరులోని పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ని సందర్శించారు. మూడు గంటలపాటు వేర్వేరు విభాగాల నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.

రాజకీయంగా మనకి ఎదురు లేదు. జగన్ పార్టీని పట్టించుకోనవసరం లేదు. అయితే లెఫ్ట్ పార్టీల్లో, ముఖ్యంగా సిపిఎం కి అనుబంధంగా వున్న టీచర్ల యూనియన్లు, అంగన్ వాడీ వర్కర్ల యూనియన్లు టఫ్ గా వున్నాయి. ఎక్కడికక్కడ వాటిని ఎనలైజ్ చేసి వీలైనంతవరకూ కలిపేసుకోవడం మనక బలం అని ఆసమావేశాల్లో లోకేష్ సూచించారు.

”తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా!” అన్నది ఎన్ టి ఆర్ నినాదమైతే మూడోతరానికి వచ్చేసరికల్లా ” బలమున్నవారిని పార్టీలో కలిపేసుకుందాం రా!” అన్నట్టు మారిపోయింది.

మంచైనా, చెడైనా అతిపెద్ద కేడర్ వన్న తెలుగుదేశం పాటించే, అమలుచేసే విధానాల ప్రభావం ప్రజాజీవనం మీద గట్టిగా వుంటుంది. దీన్ని దృష్టిలో వుంచుకుని రాజకీయాల్లో నైతిక సాంస్కృతిక కాలుష్యాలు లేకుండా విధాన నిర్ణయాలు చేయవలసిన బాధ్యత తెలుగుదేశంతో సహా అన్ని పార్టీల మీదా వుంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close