ఏపీ రికార్డ్.. ఏడాదిలో రూ. 77వేల కోట్ల అప్పు..!

ఆంధ్రలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అందులో రూ. 35వేల కోట్ల వరకూ అప్పు తీసుకుంటామని ప్రతిపాదించారు. కానీ.. ఆర్థిక సంవత్సం ముగిసే సరికి.. అంతకు రెండింతలు అప్పు చేశారు. ప్రభుత్వం చేసిన అప్పు రూ. 77వేల కోట్లు. ఓ ఆర్థిక సంవత్సరంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీగా అప్పు చేయడం.. ఇటీవలి కాలంలో లేదు. ఈ అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆప్షన్స్‌ను వాడుకుంది. ఆర్బీఐ బాండ్లు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుకుని వాడుకోవడం… ఉద్యోగుల నిధులు వాడుకోవడం.. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా నిధులు తీసుకోవడం ఇలా.. అప్పులు పుట్టడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా.. వదిలి పెట్టలేదు. ఇలా.. మొత్తంగా రూ. 77వేల కోట్లు అప్పు చేసింది.

గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా రూ. 2 లక్షల 27వేల కోట్లు. మొత్తంగా మార్చి నెలాఖరు ఖర్చు పెట్టింది రూ. 1 లక్షా 87వేల కోట్లు. ఇందులో రూ. 77వేల కోట్లు అప్పు. అంటే.. నికంగా ఏపీకి వచ్చిన ఆదాయం రూ. 1లక్షా పదివేల కోట్లకు అటూ ఇటూగానే. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు, కరోనా కారణంగా బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయింది. మూడు నెలల పద్దుల కోసం.. ఆర్డినెన్స్ జారీ చేసి.. ఖర్చులకు అనుమతి తీసుకున్నారు. అయితే.. ఈ ఏడాదిలోనూ.. అప్పులపైనే.. ప్రభుత్వం ఆధారపడటం తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కరోనా కారణంగా ఆదాయం మొత్తం నిలిచిపోవడంతో.. ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. కరోనా సహాయక చర్యలకు.. కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. ప్రభుత్వాన్ని నడపటానికి .. ఇతర సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించడానికి అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి నిధులు సమీకరించుకోవడానికి కొత్త అవకాశం లభించింది. దీంతో.. మొదట్లోనే ప్రభుత్వం రూ. మూడు వేల కోట్ల సెక్యూరిటీలు వేలం వేయడానికి ప్రయత్నించింది.అయితే.. రూ. వెయ్యి కోట్ల సెక్యూరిటీలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరో రూ. రెండు వేల కోట్ల సెక్యూరిటీల జారీని ఉపసంహరించుకున్నారు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మరో రూ. పదివేల కోట్ల అప్పుల కోసం.. ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని.. కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తులు చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close