ముగిసిన అసెంబ్లీ సెషన్: అడ్వాంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్

హైదరాబాద్: ఐదురోజులపాటు సాగిన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. ఈ సమావేశాలలో సభను ఆద్యంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేసిందని చెప్పాలి. పార్టీ అధినేత జగన్‌సహా వైసీపీ సభ్యులు చేసిన ఎదురుదాడికి అధికారపార్టీ సభ్యులు దీటుగా ప్రతిస్పందించలేకపోయారు. మొదటిరోజు పుష్కర్ ఘాట్ మృతులకు సంతాపం ప్రకటించటం దగ్గరనుంచి మొదలుపెట్టి వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్నారు. మధ్యలో ఒకరోజున జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులర్పించటానికి వెళ్ళటంతో ఆ ఒక్కరోజుమాత్రం అధికారపార్టీ సభ్యులు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఇక చివరిరోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ బ్రహ్మాస్త్రాన్ని తీసింది. ఓటుకు నోటు కేసు అంశంపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు దానిని తిరస్కరించారు. ఇక సినిమా మొదలయింది.

ఓటుకు నోటుపై చర్చకు అనుమతించాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు లేచి, నిన్న కేసీఆర్ జగన్‌కు ఫోన్ చేసి ఇంకా సభలో ఓటుకు నోటు అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని అడిగినట్లు తమకు తెలిసిందని, అందుకే సమావేశాల చివరి రోజున వైసీపీ ఈ అంశాన్ని సభలో ప్రస్తావించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. 11 కేసుల్లో ఏ-1 ముద్దాయిగా ఉండి, కోర్టు అనుమతిస్తే సభకు వచ్చిన జగన్‌కు ఇతర కేసులను ప్రస్తావించే అర్హత లేదని అన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను పదినిమిషాలపాటు వాయిదా వేశారు.

సభ తిరిగి సమావేశమైన తర్వాత జగన్ అచ్చెన్నాయుడు ఆరోపణలపై స్పందించారు. కేసీఆర్ తనకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. గతంలో చంద్రబాబే కేసీఆర్‌తో పొత్తు పెట్టుకున్నారంటూ పాత ఫోటోలుకూడా చూపించారు. ఓటుకు నోటు కేసును రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ‘దొంగ దొరకటం తప్పుకాదు – పట్టుకోవటం తప్పు’ అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసులో బయటపడిన ఆడియోలో మాట్లాడింది చంద్రబాబు అవునా, కాదా అని చెప్పాలని అన్నారు. రేవంత్‌రెడ్డికి డబ్బు ఇచ్చి పంపింది చంద్రబాబు అవునా కాదా అని చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై సభలో మాట్లాడకూడదని స్పీకర్ చెప్పినప్పుడు జగన్ మంచి పాయింట్ లేవదీశారు. ప్రతిరోజూ తనపైనున్న కేసులను టీడీపీ సభ్యులు ప్రస్తావిస్తున్నపుడు లేని అభ్యంతరం, ఓటుకు నోటు కేసు విషయంలో ఎందుకు వస్తుందని స్పీకర్‌ను అడిగారు. చివరికి చనిపోయిన తన తండ్రిపైకూడా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పేరును ఛార్జిషీట్‌లో 22సార్లు ప్రస్తావించారని అన్నారు. శాసనసభలో తనపై ఎలాంటి ఆరోపణలు చేయటానికయినా అవకాశం ఇస్తారని, తమకుమాత్రం అవకాశం ఇవ్వరని స్పీకర్‌పై ఆరోపణలు చేశారు. జగన్ మాట్లాడుతుండగానే స్పీకర్ కోడెల ఇక ప్రశ్నోత్తరాలకు వెళదామని అన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు అంగీకరించలేదు.

ఇక అధికారపక్షం ఎదురుదాడిని చూస్తే – అవినీతిపై జగన్ మాట్లాడటం దశాబ్దంలోనే పెద్ద జోక్ అని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. అవినీతి మొత్తం పేటెంట్ జగన్‌దేనని చెప్పారు. ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు తూట్లు పొడుస్తూ, ఏపీకి చెందిన అధికారుల ఫోన్లను ట్యాప్ చేసినా నోరెందుకు విప్పలేదని జగన్‌ను అడిగారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల పరిరక్షణకు ఉద్దేశించిన సెక్షన్ 8 అమలుకు సంబంధించి చర్చ జరిగినపుడు జగన్ ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు. మరోవైపు ఓటుకు నోటు కేసుమీద ప్రతిపక్షం గొడవ చేస్తారనో, ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సభకు రాలేదు.

మొత్తంమీదచూస్తే ప్రతిపక్షదాడిని దీటుగా ఎదుర్కొనేసభ్యులు అధికారపార్టీలో లేకపోవటం వారి లోటుగా కనిపిస్తోంది. అచ్చెన్నాయుడు, బొండా ఉమామహేశ్వరరావు, కాల్వ శ్రీనివాసులు తప్పితే మిగిలినవారెవరూ వైసీపీ దాడిని గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నారు. అటు వైసీపీ వైపేమో, జగన్ దగ్గరనుంచి మొదలుపెడితే చెవిరెడ్డి, రోజా, కొడాలి నాని, గొట్టిపాటి వంటి సభ్యులు అధికార పార్టీపై ఒంటికాలిమీద లేస్తూ దాడి చేస్తున్నారు. ఆ పార్టీలో అధికంగా ఉన్న యువ ఎమ్మెల్యేలు… అందులోనూ రాయలసీమవారు ప్రభుత్వంపై దాడికి ఎవర్‌రెడీగా ఉంటున్నారు. దానికితోడు జగన్ ఏదైనా ఇష్యూ వస్తే తమవారిని చేయిచూపిస్తూ మరీ పోడియం దగ్గరకు వెళ్ళమని ఉసిగొల్పుతున్నారు. వైఎస్ హయాంలో తెలుగుదేశంవైపునుంచి రేవంత్ రెడ్డి, పయ్యావుల, దేవినేని ఉమా, ధూళిపాళ బాగా దూకుడుగా ఉండేవారు… అధికారపక్షాన్ని దీటుగా ఎదుర్కొనేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలోకెళ్ళిపోవటం, పయ్యావుల గెలవకపోవటం టీడీపీకి లోటే. దేవినేని ఉమా, ధూళిపాళ నరేంద్ర ఎందుకనో గత స్థాయిలో దూకుడుగా లేరనే చెప్పాలి. ఏది ఏమైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టటంలో, సభను తమ అధీనంలోకి తీసుకోవటంలో వైసీపీ విజయవంతమైందని చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close