జనాభా లెక్కలు కాదు.. ప్రభుత్వానికి ఇష్టం లేకనే ఆగిన జిల్లాల విభజన..!?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల విభజన సస్పెన్స్‌లో పడింది. జనాభా లెక్కలే దీనికి కారణం. కరోనా కారణంగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. పూర్తి కాలేదు అందుకే రికార్డులు సిద్ధం కాలేదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న పట్టదలతో ఉంది. గతంలో ఉగాది కల్లా.. కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ ఇప్పుడు ఉగాది ముంచుకొస్తున్నా అలాంటి ఆలోచన లేదు. సీఎస్ నేతృత్వంలోనికమిటీ… రెండు, మూడు సార్లు సమావేశమైంది. జిల్లాల వారీగా కమిటీలు పని చేస్తున్నాయి. దీంతో జిల్లాల విభజనకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయింది. ప్రకటన చేస్తే సరిపోతుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకో కానీ.. పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టినప్పుడు.. చాలా డిమాండ్లు వచ్చాయి. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజించడం అనేది వైసీపీ విదానం. దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ నిజం ఆ ప్రకారం విభజిస్తే అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆ విషయం ప్రక్రియ ప్రారంభించిన వెంటనే ప్రభుత్వానికి తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నేతలే జిల్లాలను విభజిస్తే పార్టీ మట్టికొట్టుకుపోతుందని శాపనార్ధాలు పెట్టారు. ఇతర చోట్ల బహిరంగంగా అలాంటివి వినిపించకపోయినా… జిల్లాల విభజన రాజకీయంగా ఆత్మహత్యా సదృశం అవుతుందన్న ఫీడ్ బ్యాక్ రావడంతో స్లో అయ్యారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

నిజానికి జిల్లాల విభజన చేపట్టాలనుకుంటే ప్రభుత్వానికి ఇప్పటికీ అడ్డంకి కాదు. ఏదో ఓ మార్గంలో జిల్లాలను ఏర్పాటు చేసేస్తుంది. ఇప్పటి వరకూ ఏపీ సర్కార్.. ఎలాంటి ఆటంకాలు తమకు ఉన్నాయని.. ఏ విషయంలోనూ అనుకోలేదు. ఈ విషయలోనూ అనుకోదు కూడా. తర్వాత న్యాయస్థానాల్లో ఏమైనా ఇబ్బందులొస్తే అక్కడ చూసుకుంటామని అనుకుంటుంది కానీ వెనుకడుగు వేయదు. ఇప్పుడు కూడా అదే జరిగిందని చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి ఏడాది..ఏడాదిన్నర పట్టవచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత ఎన్నికల హడావుడి ప్రారంభమవుతుంది. అలాంటి సమయంలో… జిల్లాల విభజన లాంటి రిస్క్ ప్రభుత్వం తీసుకోదని అంటున్నారు. మొత్తానికి జిల్లాల విభజన రాజకీయ లాభనష్టాల చట్రంలో ఇరుక్కుంది. అది ఎప్పటికి జరుగుతుందో చెప్పడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close