వాలంటీర్ల పేరుతో సాక్షికి నెలకు ఐదున్నర కోట్లు !

ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన సాక్షి పత్రికలకు వందల కోట్ల ప్రకటనలు ఇస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని.. నైతికంగా కూడా కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నా అలాంటివేమీ తాము పట్టించుకోబోమని ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని సాక్షి పత్రికకు నెలకు రూ. ఐదున్నర కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవో జారీ చేశారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో దొరికిపోకుండా ఆదేశాలు జారీ చేయడం.. అడ్డగోలుగా వ్యవహారాలు నడపడం అలవాటు కాబట్టి… ఆదేశాలు అలాగే జారీ చేశారు.

దినపత్రికను కొనుక్కోవడానికి వాలంటీర్లకు నెలకు రెండువందలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ దిశపత్రిక అంటే నేరుగా సాక్షి అని చెప్పలేదు. ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవడానికి.. విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి విస్త్రతంగా సర్క్యూలేషన్ ఉన్న పత్రికను కొనుక్కోవడానికట. అంటే సాక్షి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ వాలంటీర్ అయినా సాక్షి మినహా దేన్నైనా కొనుగోలు చేస్తే వాలాంటీర్ ఉద్యోగం ఊడుతుంది. ఏపీ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని వారందరికీ డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన నెలకు ఐదున్నర కోట్ల వరకూ అవుతుంది.

ఇటీవలి కాలంలో సాక్షి పత్రిక సర్క్యూలేషన్ దారుణంగా పడిపోయింది. కొనేవారు లేరు. దీంతో రెండున్నర లక్షల సర్క్యూలేషన్ పెంచుకోడానికి కూడా ప్రజాధనమే ఉపయోగిస్తారన్నమాట. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకటి కాదు రెండు సాక్షి పేపర్లు కొంటున్నారు. ఇప్పుడు వాలంటీర్లకు అంటగడుతున్నారు. అటు ప్రకటనలు.. ఇటు పత్రిక కొనుగోలు మొత్తం ప్రజాధనంతో నడిచిపోయేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే సాక్షిలో పని చేసిన సగం మంది ఉద్యోగుల ప్రభుత్వంలో భాగం అయి ప్రజాధనం జీతాలుగా తీసుకుంటున్నారు. మొత్తంగా సాక్షి కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close