హైకోర్టు అమరావతిలోనే .. సుప్రీంకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వ లాయర్ !

హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని.. అక్కడే ఉండేలానేది ఏపీ ప్రభుత్వ అభిమతమని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ లాయర్ చెప్పడంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృత చర్చ జరగుతోంది. అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు హైకోర్టు అంశంపైనా విచారణకు వచ్చింది. హైకోర్టుకు ఇప్పటి వరకూ ఎంత ఖర్చు పెట్టారని జస్టిస్ జోసెఫ్ అడిగారు. రూ. 150 కోట్లు కేటాయించారని..ఇప్పటి వరకూ రూ. 116 కోట్లు ఖర్చు చేశారని ప్రభుత్వ లాయర్ తెలిపారు. ఆ సమయంలోనే హైకోర్టు ఎక్కడ ఉండాలనుకుంటున్నారని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. అమరావతిలోనే ఉంటుందని..ఉండాలని ప్రభుత్వ న్యాయవాది కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించింది. కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుందని చెబుతోంది. అయితే ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీని వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. చట్టం చేయడం ద్వారా హైకోర్టు ఎక్కడ ఉండాలో నిర్ణయించలేరు. అది కేంద్రం.. సుప్రీంకోర్టు.. హైకోర్టుల ద్వారా జరగాల్సిన నిర్ణయం. దానికో ప్రక్రియ ఉంటుంది. చట్టం చేయడం అంటే.. కోర్టులను నిర్దేశించడమే. అలా ఎలా చేస్తారన్న డౌట్ సుప్రీంకోర్టుకు వస్తుందనే.. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెప్పారని అంటున్నారు.

కారణం ఏదైనప్పటికీ.. హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే.. చట్టాలతో పని లేదు. ప్రభుత్వమే ప్రోసీడ్ కావొచ్చు. హైకోర్టు ద్వారా ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం పంపలేదు. కానీ కర్నూలులో హైకోర్టును అడ్డుకుంటున్నారంటూ రాజకీయం మాత్రం చేస్తోంది. ఈ రాజకీయంలో కోర్టుల్నీ భాగస్వామ్యం చేస్తున్నారని.. ఈ రోజు అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టుకు చెప్పడం ద్వారా తేలిపోయిదంన్న ఆరోపణలు వైసీపీ ప్రభుత్వంపై వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close