సలహాదారుకి సలహాదారులు !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సలహాదారులకు కొదవలేదు. వారానికొకరిని నియమిస్తూనే వెళ్తున్నారు. తాజాగా… సలహాదారులకు సలహాదారుల నియామకం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి స్పీచ్‌లు రాసే జీవీడీ కృష్ణమోహన్ అనే సాక్షి మాజీ జర్నలిస్టుకు ఇప్పటికే సలహాదారు పదవి ఉంది. ఈ పదవితో ఆయనకు నెలకు నాలుగైదు లక్షల వరకూ చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు మరో ఐదుగుర్ని సలహాదారులుగా నియమించారు. వారందరికి కలిపి నెలకు ఐదు లక్షల వరకూ .. జీత భత్యాలు చెల్లించనున్నారు. ఈ ఐదుగురుకి సలహాదారులకు సలహాదారులని కాకుండా జీవీడీకి సహాయకారులగా చెబుతున్నారు. ఏదైనా.. చేసే పని మాత్రం సలహాదారుకు సలహాలివ్వడమే.

ఈ ఐదుగురు ఎవరో కాదు.. సాక్షి ఉద్యోగులే. నిన్నటి వరకూ సాక్షి పే రోల్స్‌లో జీతం వచ్చేది. ఇప్పుడు ప్రజాధనాన్ని జీతం రూపంలో తీసుకుంటారు. వీరిలో సాక్షి టీవీ ఏపీ బ్యూరో చీఫ్ వెన్ను శ్రీనివాసరావు కూడా ఉన్నారు. నిజానికి ఆయన ఆ స్థానంలో ఉండటమే చాలా మందికి ఆశ్చర్యం . ఎందుకంటే.. వ్యతిరేకించే వర్గానికి చెందిన ఆయన ఆ స్థానంలో ఉండటం ఏమిటని చాలా కాలంగా సాక్షిలోనే ఆయనపై ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి. కానీ వెన్ను శ్రీనివాస్ .. తను జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్‌నని సోషల్ మీడియాలో ఇతరులతో వాదనలు పెట్టుకుని నిరూపించకుంటూ ఉంటారు. వివేకా హత్య సమయంలో కడపలోనే స్టాఫర్‌గా ఉన్న ఆయన వివేకాది హత్య కాదు గుండెపోటుగా నమ్మించడానికి శతవిధాలా ప్రయత్నం చేసి … జగన్ మెప్పు పొందారు. అందుకే ఏపీ బ్యూరో చీఫ్ అయ్యారు. కానీ ఇప్పుడు సాక్షి నుంచి ప్రభుత్వ రోల్స్‌లోకి తెచ్చారు.

ఇప్పుడు సాక్షి ఏపీ బ్యూరో చీఫ్‌గా .. ఓ రెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రభుత్వంతో పాటు సాక్షిని కూడా.. ఓ వర్గంతోనే నింపి.. ప్రక్షాళన చేసుకునే ప్రక్రియలోనే తాజా నియామకాలు జరిగాయని అంటున్నారు. కారణం ఏదైనా… ఏం జరిగినా… ప్రజాధనానికే .. రెక్కలు వస్తూండటం.. సాక్షి నిర్వహణ కూడా ప్రజాధనంతోనే చేస్తూండటం .. ఏపీ ప్రజల దురదృష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close