ఆమరణ నిరాహారదీక్షకు దిగుతున్న అన్నా హజారే

హైదరాబాద్: అక్టోబర్ 2నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు, సామాజిక కార్యకర్త అన్నాహజారే ఇవాళ ప్రకటించారు. భూ సేకరణ బిల్లు, ఒకటే హోదా-ఒకటే అంశాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో నిరాహారదీక్షకు కూర్చుంటున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను చట్టం చేయొద్దని కోరుతూ అన్నా హజారే ఈ ఏడాది మొదట్లో ప్రధాని నరేంద్ర మోడికి ఒక లేఖకూడా రాశారు. కేంద్రానికి భూ సేకరణ ఆర్డినెన్స్‌ను చట్టంగా చేయటంలో ఉన్న ఆసక్తి ఒకటే హోదా-ఒకటే పింఛను పథకం అమలుపై లేదని అన్నా ఇటీవల పలుసార్లు విమర్శలు చేశారు. అన్నా గతంలో లోక్‌పాల్ బిల్లుకోసంకూడా ఆమరణ నిరహారదీక్ష చేయటం, నాటి యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి లోక్‌పాల్ బిల్లును పాస్ చేయించం తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close