మీడియా వాచ్‌: మ‌రో ఉప సంస్థ‌ని మూసేస్తున్న రామోజీ

`ఈనాడు` ఓ మ‌హా వృక్ష‌మైతే… అందులోంచి చాలా ఉప శాఖ‌లు పుట్టుకొచ్చాయి. సితార‌, విపుల‌, చ‌తుర‌, అన్న‌దాత‌, తెలుగు వెలుగు… ప‌త్రిక‌లు `ఈనాడు` గొడుకు కింద పెరిగి, పెద్ద‌వైనవే. అయితే… విపుల‌, చ‌తుల‌, సితార‌ల‌ను మూసేసిన రామోజీ రావు.. ఆ త‌ర‌వాత ఎంతో ఇష్ట‌ప‌డి ప్రారంభించిన తెలుగు వెలుగు ప‌త్రిక‌నూ ఆపేశారు. దానికి కార‌ణం… పాఠ‌కులు క‌రువ‌వ్వ‌డం, పేప‌ర్ కాస్ట్ పెరిగిపోవ‌డ‌మే. ఇప్పుడు అన్న‌దాత ప‌త్రిక‌నీ నిలిపి వేయాల‌న్న నిర్ణ‌యం తీసుకొన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతుల‌కు ఉప‌కారిగా ఉన్న అన్న‌దాత ఇక క‌నిపించ‌దు. నిజానికి సితార‌, విపుల చ‌తుర‌, తెలుగు వెలుగు..ఇవ‌న్నీ న‌ష్టాల్లో ముగిశాయి. అన్న‌దాత లాభాల‌ను తెచ్చి పెట్టేది. అయినా స‌రే, ఇప్పుడు అన్న‌దాత‌ని మూసేస్తున్నారు. ఈనెల‌తో అన్న‌దాత ఇక క‌నిపించ‌దు. అందులోని ఉద్యోగుల‌కు వాలెంట‌రీ రిటైర్మెంట్ ఇవ్వాల‌ని సంస్థ భావిస్తోంది. అయితే.. ఉద్యోగులు మాత్రం ఈనాడులోనే వేరేశాఖ‌ల్లో స‌ర్దుబాటు చేయండ‌ని యాజ‌మాన్యాన్నికోరుతున్నారు. రామోజీకి అన్న‌దాత చాలా ఇష్ట‌మైన ప‌త్రిక‌. రైతు రంగానికి ఈ ప‌త్రిక‌తో సేవ చేయాల‌నుకొన్నారు. దాంతో లాభాల‌నూ ఆర్జించారు. కానీ స‌డ‌న్‌గా అన్న‌దాత‌ని మూసేయాల‌న్న నిర్ణ‌యం ఎందుకు తీసుకొన్నారో అర్థం కావ‌డం లేదు. మొత్తానికి ఇప్పుడు ఈనాడు ఒక్క‌టే మిగిలింది. దాని ఉప ప‌త్రిక‌ల చ‌రిత్ర మొత్తం ముగిసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close