మారుతి సినిమాకి మ‌రో స‌మ‌స్య‌

`ప్ర‌తిరోజూ పండ‌గే` త‌ర‌వాత‌… మారుతి సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. ఎట్టకేల‌కు ఇటీవ‌ల ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గోపీచంద్ తో సినిమాని అక్టోబ‌రు 1న విడుద‌ల చేస్తామ‌ని చెప్పేశారు. అయితే.. సినిమా ఇంకా క్లాప్ కొట్ట‌లేదు. మారుతి చెప్పిన‌ట్టు మార్చిలో సినిమా మొద‌లైతే..అక్టోబ‌రు 1న విడుద‌ల చేయ‌డం పెద్ద స‌మ‌స్యేం కాదు. మారుతి చ‌క చ‌క సినిమాని పూర్తి చేయ‌గ‌ల‌డు. కానీ ఇక్క‌డ మ‌రో స‌మ‌స్య ఎదుర‌వుతోంది.

మారుతికి ఇప్ప‌టి వ‌ర‌కూ హీరోయిన్ దొర‌క‌లేదు. సాయి ప‌ల్ల‌వి ని అనుకున్నా – త‌న కాల్షీట్లు ఇప్పుడు ఖాళీగా లేవు. సాయి ప‌ల్ల‌వి రేంజ్ ఉన్న హీరోయిన్ కోసం మారుతిగాలిస్తున్నాడు. ప్ర‌ధాన హీరోయిన్లంతా బిజీగా ఉండ‌డంతో.. వాళ్లెవ్వ‌రూ అందుబాటులో లేకుండా పోయారు. ఈ సినిమాకి స్టార్ హీరోయినే కావాల‌ని మారుతి ప‌ట్టుబ‌డుతున్నాడు. షూటింగ్ ప్రారంభ‌మ‌య్యేలోగా.. హీరోయిన్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఇది వ‌ర‌కైతే.. హీరోయిన్ వేట కోసం అంత క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు. హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే… మిగిలిన విష‌యాల‌పై ఫోక‌స్ పెట్టాల్సివ‌స్తోంది. కొత్త హీరోయిన్లు కావ‌ల్సినంత మంది దొరుకుతారు. కానీ స్టార్ హీరోయిన్లకే ఇప్పుడు కొర‌త వ‌చ్చింది. హీరోయిన్ ఫిక్స‌యితే గానీ, మారుతి సినిమా విష‌యంలో ఓ క్లారిటీ రాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close