మావోయిస్టు అగ్రనేతల ఎన్ కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోని ఇంద్రావతి నేషనల్ పార్క్లో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ నర్సింగాచలం చనిపోయారు. ఆరు నెలల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీకి చెందిన ముగ్గురు సభ్యులు ఎన్ కౌంటర్య్యారు. ఆయన తలపై కోటి రివార్డు ఉంది. కేంద్రం రూ. 50 లక్షలు.. ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన తలకు వెల కట్టారు.
సుధాకర్ 30 ఏళ్లుగా మావోయిస్ట్ ఉద్యమంలో చురుకుగా ఉన్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ జిల్లాకు చెందినవాడని భావిస్తున్నారు. 1988 నుండి నక్సలైట్ ఉద్యమంలో ఉన్నారు. రణదీర్ అనే పేరుతోనూ చలామణి అయినట్లుగా చెబుతున్నారు. నారాయణపూర్, బిజాపూర్, మరియు దంతేవాడ జిల్లాల సరిహద్దులోని అబుజ్మడ్ అడవుల్ ఉన్న మావోయిస్టులందర్నీ బలగాలు వెంటాడుతున్నాయి.
వచ్చే ఏడాది కల్లా మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ క్రమంలో భారీ ఆపరేషన్లతో ఎన్ కౌంటర్లు చేస్తోంది. కాల్పుల విరమణ పాటిస్తామని .. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు చెబుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఆపరేషన్ కగార్ తో నక్సలైట్లు లేకుండా చూడాలని నిర్ణయించుకుంది.