తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క..!

క్రికెట్ కెప్టెన్ , హీరోయిన్ కపుల్ “విరుష్క” తల్లిదండ్రులు కాబోతున్నారు. వచ్చే జనవరిలోనే.. తమ కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని వారు విరాట్ కోహ్లీ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ మేరకు బేబీబంప్‌తో ఉన్న అనుష్క ఫోటోను కూడా.. కోహ్లీ షేర్ చేశారు. కొంత కాలం పాటు డేటింగ్ చేసి… 2017 డిసెంబర్ 11న కోహ్లీ, అనుష్కలు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ తమ తమ కెరీర్‌లో క్షణం తీరిక లేకుండా ఉండేవారు. ఎప్పుడైనా అవకాశం దొరికితే విహారయాత్రల్లోనే ఉండేవారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కోహ్లీ వివరాలను ఎప్పటికప్పుడు…వెల్లడిస్తూనే ఉండేవారు.

మూడు ఫార్మట్లలోనూ స్టార్ ప్లేయర్‌ కమ్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి… వ్యక్తిగత జీవితం తక్కువే. స్టార్ హీరోయిన్‌గా ఉన్న అనుష్క పరిస్థితి కూడా అంతే. అయితే.. వారికి.. లాక్ డౌన్ కలిసి వచ్చింది. కరోనా కాలంలో… ఆటలు.. సినిమాలు.. షూటింగ్‌లు ఎక్కడివక్కడ బంద్ కావడంతో… ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో… తమ వ్యక్తిగత జీవితంలో మరో గోల్ సాధించడానికి విరుష్క జంట ఉపయోగించుకున్నట్లుగా కనిపిస్తోంది. కోహ్లీ.. గుడ్ న్యూస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగానే.. వచ్చిన కామెంట్లలో ఎక్కువ.. క్రెడిట్.. పానడమిక్‌కే ఇవ్వాలని సూచించినవే.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ… ఐపీఎల్ కోసం.. దుబాయ్‌లో ఉన్నారు. అక్కడకు కుటుంబసభ్యులెవరినీ అనుమతించడం లేదు. కనీసం… నాలుగైదు నెలల పాటు… దుబాయ్‌లోనే ఉండాల్సి ఉంటుంది. ఐపీఎల్ నుంచి కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చే సరికి.. వారసుడో.. వారసురాలో.. భూమి మీదకు రావడానికి సిద్ధంగా ఉంటారన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close