ఏపీ బీజేపీ రథయాత్ర వాయిదా..!

అనుమతి ఇవ్వకపోతే బీజేపీ విశ్వరూపం చూస్తారని రథయాత్ర గురించి భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేతలు… రథయాత్రను ఇప్పుడు వాయిదా వేసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు దూసుకు రావడంతో.. జనసేనతో కలిసి అన్ని చోట్లా పోటీ చేయాలన్న లక్ష్యంతో రథయాత్రను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లుగా సోము వీర్రాజు ప్రకటించారు. ఆలయాలపై దాడులకు నిరసనగా.. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు.. కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేయాలని బీజేపీ నేతలు సంకల్పించారు. దీనికోసం ఏర్పాట్లు కూడా ప్రారంభించారు.

అయితే అనూహ్యంగా పంచాయతీ ఎన్నికలు ఖరారు కావడంతో ఇప్పుడు… దానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. పార్టీ నేతలు.. నిర్ణయం తీసుకుని హైకమాండ్‌కు తెలిపారు. హైకమండ్ కూడా అంగీకరించడంతో రథయాత్ర వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఆగిపోయిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికలు జరుగుతాయి. ఇదయ్యే సరికి మార్చి అయిపోతుంది. ఆ తర్వాతే రథయాత్ర గురించి ఆలోచించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

అయితే అప్పటికే ఆలయాలపై దాడుల అంశం పాతబడిపోతుందా.. రథయాత్ర చేస్తే.. అంత పబ్లిసిటీ వస్తుందా అన్నదాన్ని బేరీజు వేసుకుని తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకునే అవకాశం ఉంది. జనసేనతో విస్తృత సంప్రదింపులు జరుపుతున్న బీజేపీ నేతలు పంచాయతీల్లోనూ కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు. చాలా గ్రామాల్లో రెండు పార్టీలకు పెద్దగా క్యాడర్ నిర్మాణం లేకపోవడంతో.. వీలైనన్ని ఎక్కువ చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close