రేపే ఏపీ కేబినెట్ భేటీ..! హైకోర్టుకే కౌంటర్..?

ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను అమరావతి నుంచి విశాఖ తరలించడానికి ప్రభుత్వం.. కోర్టులను సైతం..తప్పించుకునేలా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు.. రాజధాని రైతులు తమ అభ్యంతరాలు చెప్పుకునేందుకు మరింత గడువు కావాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సమయంలోనే… ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఇరవయ్యో తేదీ నిర్వహించాలనుకున్న మంత్రివర్గ సమావేశాన్ని రెండు రోజులు ముందుకు జరిపింది. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు భేటీని ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం…హైకోర్టులో.. రైతులు పిటిషన్ వేసిన తర్వాతే జరిగింది. రైతులు.. సోమవారం మ.2.30వరకు గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేయొచ్చని హైకోర్టు ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సమయం ఇచ్చింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

ఈ పిటిషన్‌లోనే.. ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వకుండా అదేశాలు ఇవ్వాలని రైతులు కోరారు. దీనిపై.. కోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని .. రైతుల తరపు న్యాయవాదులు భావించారు. ప్రభుత్వానికి కూడా ఇదే డౌట్ వచ్చినట్లుగా ఉంది.. అందుకే సోమవారం నిర్వహించాలనుకున్న కేబినెట్ భేటీని శనివారమే ఏర్పాటు చేశారు. అదే సమయంలో.. హైపవర్ కమిటీ.. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో… తమ సిఫార్సులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇస్తామన్నారు. కానీ.. హైకోర్టులో రైతుల పిటిషన్ నేపధ్యంలో.. శనివారమే.. కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు కాబట్టి… హైపవర్ కమిటీ కూడా… కేబినెట్ భేటీకి ముందే.. రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్‌పై కేబినెట్‌లో చర్చించి.. ఆమోద ముద్రవేస్తారు.

హైపవర్ కమిటీ నివేదికలో .. భిన్నమైన అంశాలు ఉండే అవకాశం లేదని.. ఇప్పటికే అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అసలు రిపోర్టులు రాసేవాళ్లు ప్రభుత్వంలో ఉన్నారని.. ఇతర కమిటీలన్నీ.. కేవలం సంతకాలకే పరిమితమని.. విపక్షాలు కొంత కాలం నుంచి ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి నోట మూడు రాజధానుల మాట వచ్చింది కాబట్టి.. దాన్నే సమర్థిస్తూ.. హైపవర్ నివేదిక ఉంటుందని రాజధాని రైతులు సహా.. అన్నిపార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. అంటే… న్యాయపరంగా కూడా.. రాజకీయ వ్యూహాలను.. ఏపీ సర్కార్.. అమలు చేస్తోందన్న అభిప్రాయం రైతుల్ోల ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close